Asianet News TeluguAsianet News Telugu

రైతు పొలంలో బంగారం, వెండి ఆభరణాలతో బిందె లభ్యం: అధికారులకు అప్పగింత

జిల్లాలోని పెంబర్తి గ్రామంలో  ఓ రైతు పొలంలో బంగారంతో నిండి ఉన్న బిందె లభ్యమైంది. 

Farmer finds gold pot  while ploughing his land in Telangna lns
Author
Warangal, First Published Apr 8, 2021, 2:04 PM IST


జనగామ: జిల్లాలోని పెంబర్తి గ్రామంలో  ఓ రైతు పొలంలో బంగారంతో నిండి ఉన్న బిందె లభ్యమైంది. హైద్రాబాద్ కు చెందిన నర్సింహ అనే వ్యక్తి పెంబర్తి గ్రామ సమీపంలో వరంగల్-హైద్రాబాద్ జాతీయ రహదారికి సమీపంలో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.

ఈ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించాలని ఆయన ప్లాన్ చేశాడు.  దీనికి గాను ఆయన ఈ భూమిని జేసీబీతో చదును చేస్తుండగా లంకె బిందె (బంగారంతో ఉన్న బిందె) కన్పించింది.

దీంతో వెంటనే ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ బిందెను  తెరిచి చూస్తే  17 తులాల బంగారం, 10 కిలోల వెండి లభ్యమైంది. కొన్ని రోజులుగా తనకు కలలో అమ్మవారు కన్పిస్తున్నారన్నారు. తన భూమిలో అమ్మవారికి గుడిని కట్టించనున్నట్టుగా ఆయన చెప్పారు.

ఈ భూమిని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, తహసీల్దార్ రవీందర్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు తదితరులు సందర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios