Asianet News TeluguAsianet News Telugu

వాళ్లే కిందకూర్చోమని ఫోటోలు తీశారు.. అదంతా దుష్ప్రచారమే : యాదమ్మ

సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై కరీంనగర్ యాదమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ తనను కన్నతల్లిలా చూసుకున్నారని కొంతమంది కావాలని ఫోటోలు తీసి ఇలా చెడుగా ప్రచారం చేస్తున్నారన్నారు. 

fake stories on social media..They took pictures asking us to sit down and did that says Yadamma
Author
Hyderabad, First Published Jul 4, 2022, 10:30 AM IST

హైదరాబాద్ : నోవాటెల్ ప్రాంగణం లోపలికి తనను రానివ్వలేదు అంటూ కొందరు కావాలనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కరీంనగర్ కు చెందిన యాదమ్మ తెలిపారు. తాము హెచ్ఐసీసీ వద్దకు రాగానే బండి సంజయ్ కారు పంపించి.. హోటల్ లోకి తీసుకు వెళ్లారని తల్లిలాగా చూసుకున్నారని ఆమె వివరించారు.  హోటల్ కి రాగానే కొందరు యువకులు కింద కూర్చోమని చెప్పి ఫోటోలు తీశారు. ఆ తర్వాత ఈ దుష్ప్రచారం చేశారు.  కింద కూర్చోమన్న సమయంలో  వారి దుర్బుద్ధి తనకు అర్థం కాలేదని ఆమె వాపోయారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో బీజేపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వంటలు చేసిన యాదమ్మ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది.  బీజేపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన ప్రధాని మోడీకి తెలంగాణ వంటకాలు రుచి చూపించాలనుకున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. దీనికోసం కరీంనగర్ కు చెందిన యాదమ్మను ఎంపిక చేశారు. మామూలుగా దేశ ప్రధానికి వండి వడ్డించడం అంటే.. కనీసం ఐదు నక్షత్రాల హోటల్లో చేయితిరిగిన నలభీములు అయి ఉండాలి.  కానీ,  హైదరాబాద్ కి వచ్చిన ప్రధాని ఓ సామాన్య చేతి వంట రుచి చూశారు. 

ఆమె అతి సాధారణమైన మహిళ. రుచికరమైన తెలంగాణ వంటల తయారీలో మాత్రం అసామాన్యురాలు. వంటల తయారీలో అందెవేసిన చెయ్యి. అందుకే ఏరికోరి ఆమెను ఎంపిక చేశారు బీజేపీ నేతలు. జులై రెండు నుంచి నేటి వరకు హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానికి అచ్చ తెలంగాణ వంటలు రుచి చూపించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. దీనికోసం కరీంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను ఎంపిక చేశారు. 

యాదమ్మ 29 సంవత్సరాలుగా వంటలు చేస్తూ జీవిస్తోంది. యాదమ్మ స్వగ్రామం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామం. యాదమ్మకు 15 యేటనే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ కు చెందిన వ్యక్తితో పెళ్లి అయ్యింది. దీంతో భర్తతో పాటు యాదమ్మ కరీంనగర్ చేరుకుంది. అక్కడే మంకమ్మతోటలో ఉండే వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. ఈమె చేసే శాకాహార మాంసాహార వంటకాలు చాలా ఫేమస్. ఒక్కసారి రుచి చూసిన వారు ఆహా అనకుండా ఉండలేరు అని చెబుతారు. 500, 1000 మందికి కాదు ఏకంగా 10 వేల మందికి కూడా ఇట్టే.. వండి వార్చేస్తుంది యాదమ్మ. 

ప్రధాని మోడీ కోసం ప్రత్యేకంగా పిలుపు.. వంట మాస్టర్ యాదమ్మకు అవమానం, నోవాటెల్ లోకి ‘‘ నో ఎంట్రీ ’’

మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ పాల్గొన్న కార్యక్రమాలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించే సమావేశాలకు  చాలాసార్లు వంటలు చేయడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. యాదమ్మను బుధవారం  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  హైదరాబాద్ పిలిపించారు.  కొన్ని వంటలు తయారు చేయించుకుని  రుచి చూశారు. ఈ సందర్భంగా యాదమ్మ మాట్లాడుతూ..  ‘మోడీ సారు  తెలంగాణ వంటకాలు గురించి అడిగారట.  మా బండి సంజయ్ సారు.. మా యాదమ్మ  మంచి రుచికరమైన వంటకాలు అని చెప్పారట. 

దీని కోసం యాదమ్మను గత బుధవారం పెద్ద హోటల్ కు పిలిపించారు. దీనిమీద ఆమె మాట్లాడుతూ ‘కూరగాయలతో భోజనం కావాలన్నారు’ అని తెలిపారు. తాము ‘పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగారన్నం లాంటి ఐదు రకాల వంటలు…గంగవాయిల కూర పప్పు, పచ్చి పులుసు, సాంబారు, గుత్తొంకాయ కూరగాయలు వండుతాం. సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్షాలు, పాయసం, పప్పు గారెలు కూడా తయారు చేస్తాం’ అన్నారు. ఇక ‘పెద్ద హోటళ్లలో ముఖ్యమైన వాళ్ళ కోసం వంట చేయమంటున్నారు.  ప్రధాని మొదటిసారి నేను చేసే వంట తింటానంటే అంతకంటే ఎక్కువ ఏముంటుంది అదే నాకు భాగ్యం’ అంటూ జూన్ 29న యాదమ్మ ఆనందంగా తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios