Asianet News TeluguAsianet News Telugu

బీటెక్ బాబా విశ్వ చైతన్య స్వామి అరెస్ట్.. భారీగా నగదు, నగలు స్వాధీనం...

దీనికి సంబంధించి ఎస్పీ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన విశ్వ చైతన్య డిగ్రీ పూర్తిచేసి 2002లో హైదరాబాదులోని నల్లకుంటలో కంప్యూటర్ సెంటర్ ప్రారంభించాడు. అక్కడికి వచ్చిన వినియోగదారుల నుంచి సుమారు కోటి రూపాయలు అప్పు చేసి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా 20 రోజులు జైల్లో ఉండి బెయిల్పై బయటికి వచ్చాడు

Fake godman arrested in Telangana for cheating people, Rs 26 lakh cash, gold seized
Author
Hyderabad, First Published Aug 4, 2021, 4:09 PM IST

భక్తి ముసుగులో అమాయక ప్రజలను మోసం చేస్తున్న విశ్వచైతన్య స్వామితో పాటు అతని ముగ్గురు శిష్యులను నల్గొండ జిల్లా పోలీసులు మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మాయమాటలతో పలువురు భక్తులను మోసం చేశారనే ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. నిందితుల నుంచి రూ.26 లక్షల నగదు, అరకిలో బంగారం, రూ. కోటిన్నర విలువ చేసే ఫిక్స్ డ్ డిపాజిట్ బాండ్లు, 17 ఎకరాల భూమి, పత్రాలు, ఏడు ల్యాప్ ట్యాప్ లు, 4 సెల్ ఫోన్లు, ఒక కారు, రూ. 50 లక్షలు విలువ చేసే వివిధ రకాల మూలికలు స్వాధీనం చేసుకున్నారు. 

దీనికి సంబంధించి ఎస్పీ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన విశ్వ చైతన్య డిగ్రీ పూర్తిచేసి 2002లో హైదరాబాదులోని నల్లకుంటలో కంప్యూటర్ సెంటర్ ప్రారంభించాడు. అక్కడికి వచ్చిన వినియోగదారుల నుంచి సుమారు కోటి రూపాయలు అప్పు చేసి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా 20 రోజులు జైల్లో ఉండి బెయిల్పై బయటికి వచ్చాడు

ఆ తర్వాత 2017 లో సొంతంగా శ్రీ సాయి సర్వస్వం పేరుతో యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి భక్తులకు సెల్ ఫోన్ లోనే సూచనలు, సలహాలు ఇచ్చే వాడు. మూడేళ్ల క్రితం నల్గొండ జిల్లాలోని పీఏ పల్లి మండలం అజ్మాపురంలో శ్రీ సాయి సర్వస్వం మాన్సి చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశాడు.  బాబా ప్రవచనాల పేరుతో మహిళలను ఆకర్షించి వారి నుంచి లక్షల రూపాయల నగదు, నగలు విరాళంగా పొందేవాడు. ఇవే కాకుండా రకరకాల మూలికలను హైదరాబాదులో కొనుగోలు చేసి ఆశ్రమంలో ఎక్కువ ధరకు భక్తులకు భక్తులకు విక్రయించే వాడు.

‘‘ నాతో శృంగారం చేస్తే ... నా శక్తులన్నీ మీలో ప్రవేశిస్తాయి’’ : మహిళల్ని ట్రాప్, 11 మందితో దొంగ బాబా రాసలీలలు

ఇలా మోసపోయిన ఓ భక్తురాలు ఇచ్చిన ఫిర్యాదుతో విశ్వ చైతన్య మోసాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు విశ్వ చైతన్య (50)తో పాటు అతని శిష్యులైన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నివాసి గాజుల గౌతమ్,(26) ఖమ్మం పట్టణానికి చెందిన వంగారపు సృజన్ కుమార్ (28), నాగర్ కర్నూలు జిల్లా అమన్ గల్ కు చెందిన ఓర్పు విజయ్ (25) ఉన్నారు. వీరిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. 

కాగా, నల్గొండలో బురిడీ బాబా విశ్వచైతన్య  స్వామికి 11 మంది మహిళలతో లైంగిక సంబంధాలు వున్నట్లుగా పోలీసులు గుర్తించారు. లైంగికంగా కలిస్తే తనలోని శక్తులు మీకూ వస్తాయని మహిళలను విశ్వచైతన్య నమ్మించాడని తేలింది. మాయమాటలతో మహిళలను ట్రాప్ చేసి వీడియో కాల్స్ చేసేవాడని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. బురిడీ బాబా నుంచి రూ.26 లక్షల నగదు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అతని రెండో భార్య సుజితపైనా రూ.1.30 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు వున్నట్లు ఎస్పీ తెలిపారు. 

బాబా అవతారమెత్తిన బీటెక్ గ్రాడ్యుయేట్: భారీగా ఆశ్రమం... దొంగ పూజలతో కోట్లల్లో సంపాదన

సదరు దొంగబాబా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఏ సమస్యలతో బాధపడుతున్నా సరే.. అమావాస్య, పున్నమికి వస్తే ప్రత్యేక పూజలు చేసి మీ సమస్యలు తీరుస్తా.. అని నమ్మబలికాడు. అయితే ఓ మహిళ ఫిర్యాదుతో దొంగ బాబా లీలలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాకు చెందిన సాయి విశ్వ చైతన్య హైదరాబాదులో పుట్టి పెరిగాడు. అక్కడే బీటెక్‌ వరకు చదివాడు. అనంతరం విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో పీఏపల్లి మండలంలోని అజ్మాపురంలో పది ఎకరాల విస్తీర్ణంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. సాయిబాబా ప్రవచనాలు చెబుతూ, తాయత్తులు కడుతూ, హోమాలు చేస్తూ రూ. కోట్లు వసూలు చేశాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios