నిజామాబాద్ జిల్లాలో శనివారం పేలుడు ఘటన కలకలం రేకెత్తించింది. అయితే అది రసాయనాల పెట్టెను కదిలించడం వల్ల సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. 

తెలంగాణలోని నిజామాబాద్ లో పేలుడు సంభవించింది. పట్టణంలోని బడా బజార్ ప్రాంతంలో ఓ కెమికల్ బాక్స్ ను కదిలించడంతో ఇది చోటు చేసుకుంది. దీంతో ఒక్క సారిగా పేలుడు జరిగి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వెంటనే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఛత్తీస్‌గఢ్‌ లో ఘోర ప్రమాదం... ఫ్లైఓవర్‌ను ఢీకొట్టి కిందపడ్డ బైక్‌.. దంపతులు మృతి, కుమార్తెకు గాయాలు

క్షతగాత్రుడిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో మాట్లాడుతూ... ‘‘ మాకు పేలుడుపై సమాచారం అందింది. కెమికల్స్ ఉన్న బాక్స్ ను కదిలించినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని ఈ ఘటనలో గాయపడిన వ్యక్తులు చెప్పారు. అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుంది. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు.’’ 

తమిళనాడులో మాండౌస్ తుఫాను బీభత్సం.. నలుగురు మృతి ; టాప్ పాయింట్స్

పేలుడు గురించి తమకు సమాచారం అందిందని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో తెలిపారు. రసాయనాల పెట్టెను కదిలించినప్పుడు పేలుడు జరిగిందని ఈ సంఘటనలో గాయపడిన వారు తెలిపారు. అగ్నిమాపక దళాన్ని పిలిచారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు మరియు అతను ఇప్పుడు బాగానే ఉన్నాడు.

Scroll to load tweet…

కాగా.. ఘటనా స్థలానికి పోలీసులు బృందం చేరుకొని సాక్ష్యాలను సేకరించడానికి ప్రయత్నించారు. పేలుడు అనంతర పరిణామాలను చిత్రీకరించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.