Asianet News TeluguAsianet News Telugu

ఈడీ సోదాలు:నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం

ఈఎస్ఐ కి చెంిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కేసులో ఈడీ అధికారులు  నిర్వహించిన సోదాల్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. మాజీ కార్మిక శాఖ మంత్రి, దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి నివాసంలో భారీగా నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. 

ED raids in IMS, ESI scams in Hyderabad lns
Author
Hyderabad, First Published Apr 11, 2021, 10:31 AM IST

హైదరాబాద్:ఈఎస్ఐ కి చెంిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కేసులో ఈడీ అధికారులు  నిర్వహించిన సోదాల్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. మాజీ కార్మిక శాఖ మంత్రి, దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి నివాసంలో భారీగా నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. 

ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టైన్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తి  కాంట్రాక్టర్ కంచర్ల శ్రీహరిబాబు, మాజీ కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లతో కలిపి సుమారు ఏడు చోట్ల  శనివారం నాడు ఈడీ అధికారులు  సోదాలు నిర్వహించారు.

శనివారం ఉదయం 6 గంటల నుంచే నిందితుల ఇళ్లలో ఏకకాలంలో మొదలైన తనిఖీలు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముగిశాయి. నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి, మాజీ పీఎస్‌ ముకుందరెడ్డి, అతని బావమరిది వినయ్‌రెడ్డి, ఏడు డొల్ల ఫార్మా కంపెనీల అధినేత బుర్రా ప్రమోద్‌రెడ్డి ఇళ్లల్లో భారీగా నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ.3 కోట్ల నగదు లభించిందని ఈడీ ప్రకటించింది.

నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి నివాసంలో రూ. 1.50 కోట్లు, ప్రమోద్ రెడ్డి ఇంటి నుండి రూ. 1.15 కోట్లు, ఎం. వినయ్ రెడ్డి ఇంటి నుండి రూ. 45 లక్షలు  స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాదు కోటి రూపాయాల విలువైన నగలు, ఖాళీ చెక్కులను ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు.

2015–2019 మధ్యకాలంలో దాదాపు రూ.700 కోట్ల మందుల కొనుగోళ్లలో సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు అవినీతితోపాటు మనీలాండరింగ్‌ కూడా జరిగిందన్న ఏసీబీ నివేదిక ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ విషయమై ఇప్పటికే ఏసీబీ  8 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది.

ఈఎస్‌ఐలోని ఐఎంఎస్‌లో మందుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా 2019, సెప్టెంబర్‌లో ఏసీబీ రంగంలోకి దిగింది. అప్పటి డైరెక్టర్‌ దేవికారాణిని విచారణకు పిలిచి ఆమెతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసింది. 

2015 నుంచి 2019 వరకు రూ.700 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో అప్పటి డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ డైరెక్టర్‌ పద్మ  నిబంధనలు తుంగలో తొక్కారని  ఏసీబీ నివేదికలో తెలిపింది. మందుల కొనుగోలుకు స్పష్టమైన మార్గదర్శకాలతో 2012లోనే ప్రభుత్వం జీవో నంబర్‌ 51ని విడుదల చేసింది. దాని ప్రకారం రిజిస్టర్డ్‌ కంపెనీలను మాత్రమే టెండర్లకు పిలవాలి.

అత్యవసర సమయాల్లో మాత్రమే నాన్‌ రిజిస్టర్డ్‌ కంపెనీలకు టెండర్లు ఇవ్వాలి. కానీ ఈ ఒక్క లొసుగును అడ్డంపెట్టుకుని దేవికారాణి, పద్మ, ఓమ్మీ ఫార్మా ఎండీ కంచర్ల శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జీలు కథ నడిపారని ఏసీబీ గుర్తించింది. అర్హతలేని కంపెనీలకు చెందిన మందులను అధిక ధరలకు శ్రీహరిబాబు కోట్‌ చేశారు. 

వాటిని వీరిద్దరూ అంగీకరించేవారు. బదులుగా వీరిద్దరి ఖాతాల్లో రూ.కోట్లు వచ్చి చేరాయి. శ్రీహరిబాబుతో పాటు నిందితులంతా దాదాపుగా 100కు పైగా డొల్ల కంపెనీలను సృష్టించి వాటికి సైతం కాంట్రాక్టులు దక్కించుకుని ప్రభుత్వ సొమ్మును తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు.చాలాసార్లు ఖాళీ ఇండెంట్లపై దేవికారాణి, పద్మ సంతకాలు చేయించుకుని తమకు నచ్చిన ధర వేసుకునేవారని ఏసీబీ గుర్తించింది. ఫలితంగా నిందితులంతా అనతికాలంలో అనేక చోట్ల భూములు, ప్లాట్లు, నగలు, నగదు కూడబెట్టారని ఏసీబీ గుర్తించింది.

ప్రభుత్వ సొమ్మును నచ్చిన కాంట్రాక్టరుకు దోచిపెట్టడం వారిచ్చిన కమిషన్లతో  ఆస్తులు కొన్నారు. విందులు–వినోదాలు, జల్సాలు, విదేశాలకు విహారయాత్రలకు వెళ్లారు. వీరి జీతాలెంత, కొన్న ఆస్తుల విలువెంత, ఐటీ ఎంత కట్టారనే వివరాలన్నింటినీ ఏసీబీ గతంలోనే సేకరించింది. ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన కంచర్ల శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జీ ఖాతాలో 2018లో ఏకంగా రూ.54 కోట్లు వచ్చి పడ్డాయి. అతనికి రూ.99 కోట్ల విలువైన షేర్లు, రూ.24 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.

శ్రీహరిబాబు లెజెండ్‌ అనే డొల్ల కంపెనీని సృష్టించి దానికి కృపాసాగర్‌ రెడ్డి అనే బినామీని కూడా పెట్టాడు. ఇక దేవికారాణి తనకు వచ్చిన డబ్బును ఏకంగా రియల్‌ ఎస్టేట్‌లో పెటుబడులు పెట్టింది. 2020, సెప్టెంబర్‌లో దేవికారాణి దాదాపు రూ.4.47 కోట్ల రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులను తిరిగి స్వాధీనం చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios