మొయినాబాదులో ఆదివారంనాడు ఓ కారు స్కూటీని ఢీకొట్టింది. దాంతో ప్రేమిక అనే అమ్మాయి అక్కడికక్కడే మరణించింది. మరో అమ్మాయి సౌమ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మూడో అమ్మాయి ఆక్షర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. డ్రైవర్ కారును వదిలేసి పారిపోయాడు. కారు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మొయినాబాదులో జరిగిన accidentలో మరో అమ్మాయి మరణించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. మరో అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతన్నారు. 

మొయినాబాదులో ఆదివారంనాడు ఓ car, Scootyని ఢీకొట్టింది. దాంతో ప్రేమిక అనే అమ్మాయి అక్కడికక్కడే మరణించింది. మరో అమ్మాయి సౌమ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మూడో అమ్మాయి ఆక్షర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. డ్రైవర్ కారును వదిలేసి పారిపోయాడు. కారు డ్రైవర్ liquor సేవించి ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు.

ప్రమాదానికి గురైన అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందినవారు. వాళ్లు అన్నదమ్ముల పిల్లలు. దీంతో కుటుంబంలో తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అక్షర తొమ్మిదో తరగతి చదువుతోంది.

పొగమంచు ప్రమాదం

హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రమాదం చోటు చేసుకుంది. ముందుకు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓఆర్ఆర్ నుంచి కోదాడకు వెళ్లే దారిలో ఈ రోడ్డు ప్రమాదం సభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

అన్నను చంపి.. తల్లి పక్కకు చేరి నిద్రపోయాడు.. తెల్లారి లేచేసరికి..

ఇదిలా ఉండగా, కర్నాటకలో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది..స్నేహితురాలి Birthday.. ఆ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. అప్పటివరకు నవ్వుతూ, తుళ్లూతూ, ఛాలెంజింగ్ గా గడిపిన ఆ యువతి క్షణాల్లో విగతజీవిగా మారింది. ఫ్రెండ్ బర్త్ డేకు సొంత కారులో వెడుతూ.. మిగతా స్నేహితులతో car race పెట్టుకోవడమే.. ఆమె పాలిట Death knellగా మారింది. 

కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. యువతులు రెండు కార్లలో పోటాపోటీగా ప్రయాణిస్తుండగా ఒక కారు ప్రమాదానికి గురైంది. మండ్య జిల్లా నాగమంగళం తాలూకాలోని గేటు వద్ద ఆదివారం ఉదయం కారు ప్రమాదంలో ఒక యువతి మరణించింది.  మృతురాలు బెంగళూరు  బాగలకుంటెకు చెందిన హెచ్‌టి. మంజుళాదేవి, పద్మరాజు దంపతుల కుమార్తె తనుశ్రీ (21)గా గుర్తించారు. 

ఈమె మైసూరులో బీబీఏ చివరి సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటోంది. స్నేహితురాలి పుట్టినరోజు ఉండడంతో ఆదివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో సొంత కారు డ్రైవింగ్ చేసుకుంటూ మైసూర్ కు బయలుదేరింది. మధ్యలో ఇద్దరు స్నేహితురాళ్లు వారి, వారి కార్లలో వచ్చారు. వీరు ఇద్దరు పోటీలు పడుతూ, కార్లను వేగంగా నడుపుతూ వెళ్లారు.

మద్యం మత్తు, అతివేగం: స్కూటీని ఢీకొట్టిన కారు.. బాలిక ప్రాణం తీసిన మందుబాబులు

ఈ సమయంలో తనుశ్రీ కారు అదుపుతప్పి కోణనూరు దగ్గర వంతెన గోడను ఢీ కొట్టి సుమారు 50 అడుగుల దూరం పల్టీలు కొట్టింది.  తనుశ్రీ తీవ్రగాయాలతో అక్కడే కన్నుమూసింది. నాగ మంగళ పోలీసులు కేసు నమోదు చేశారు.