Asianet News TeluguAsianet News Telugu

11.1 కిలోల బంగారం, రూ.1.5 కోట్ల విదేశీ కరెన్సీ: హైదరాబాద్ లో పట్టుబడ్డ మహిళా స్మగ్లర్

శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాళ తెల్లవారుజామున  భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన విమానంలో దాదాపు 11 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న  ఓ మహిళను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆమెను అధికారులు తమదైన రీతిలో  ప్రశ్నించగా మరిన్ని  నిజాలను బయటపెట్టింది. 

DRI officers seized 11.1 kg gold at Rajiv Gandhi International Airport ,Hyderabad
Author
Hyderabad, First Published May 28, 2019, 9:09 PM IST

శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాళ తెల్లవారుజామున  భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన విమానంలో దాదాపు 11 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న  ఓ మహిళను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆమెను అధికారులు తమదైన రీతిలో  ప్రశ్నించగా మరిన్ని  నిజాలను బయటపెట్టింది. 

గత మూడు నెలలుగా విదేశాల నుండి అక్రమంగా బంగారం, విదేశీ కరెన్సీని ఆ మహిళ హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.  దీంతో ఆమె తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ లోని  ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తనిఖీలు నిర్వహించగా దాదాపు రూ.1.5 కోట్ల విలువ చేసే కలిగిన విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఈ కరెన్సీ మొత్తం సింగపూర్ డాలర్స్, యూఏఈ దినార్స్ రూపంలో వుంది. 

DRI officers seized 11.1 kg gold at Rajiv Gandhi International Airport ,Hyderabad

విమానాశ్రయంలో లభించిన బంగారం, హోటల్లో దొరికిన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళ ప్రత్యేకంగా తయారుచేసిన ఓ క్లాత్ ను  ఈ బంగారం స్మగ్లింగ్  కు ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. అందేవల్లే విమానాశ్రయ తనిఖీ అధికారులకు ఆమె పట్టబడకుండా యదేచ్చగా మూడు నెలల పాటు ఈవ్యవహారాన్ని నడిపినట్లు తెలిపారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సదరు మహిళా స్మగ్లర్ ను తనిఖీ చేయగా ఈ వ్యవహారం బయటపడినట్లు డిఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఈమె వద్ద లభించిన బంగారం, విదేశీ కరెన్సీ మొత్తం కలిపి రూ. 3,62,52,500విలువ వుటుందని  అంచనావేశారు. 

ప్రస్తుతం స్మగ్లింగ్ కు పాల్పడిన మహిళను పోలీసులకు అప్పగించినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఆమె నుండి ఈ వ్యవహారానికి సంబంధించిన మరింత సమాచారం రాబట్టడానికి ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios