డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్పై సైబర్ దాడి: ఉత్పత్తుల నిలిపివేత
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పై సైబర్ దాడి జరిగింది. దీంతో ఐదు దేశాల్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తన ఉత్పత్తులను నిలిపివేసింది. 24 గంటల తర్వాత ఉత్పత్తులను తిరిగి ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.
హైదరాబాద్: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పై సైబర్ దాడి జరిగింది. దీంతో ఐదు దేశాల్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తన ఉత్పత్తులను నిలిపివేసింది. 24 గంటల తర్వాత ఉత్పత్తులను తిరిగి ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.
గురువారం నాడు ఉదయం సైబర్ దాడి జరిగినట్టుగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.సైబర్ దాడి జరిగిన తర్వాత అవసరమైన నివారణ చర్యలు తీసుకొనేందుకు వీలుగా డేటా సెంటర్ సేవలను వేరు చేసినట్టుగా డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రకటించింది.
అమెరికా, లండన్, బ్రెజిల్, రష్యా, ఇండియాలలో ఉత్పత్తును ఆ సంస్థ నిలిపివేసింది. మరో 24 గంటల తర్వాత ఉత్పత్తులను ప్రారంభించనున్నట్టుగా ప్రకటించింది.స్టాక్ ఎక్చేంజ్ కు ఇచ్చిన సమాచారంలో కంపెనీపై సైబర్ దాడి జరిగిన విషయాన్ని తెలిపింది.
అంతేకాదు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొన్నట్టుగా ప్రకటించింది. డేటా సెంటర్ సేవలను వేరు చేశామని చెప్పారు.డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీ కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం పరిశోధనలు చేస్తోంది. ఈ మేరకు డీసీజీఐ ఆమోదం తీసుకొన్న విషయం తెలిసిందే.