ఢిల్లీలో చదువు: ఇంటికొచ్చి ఉరేసుకున్న తెలుగు విద్యార్ధిని
హాస్టల్ యాజమాన్యం వేధింపులతో డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన ఐశ్వర్య.. ఢిల్లీలో డిగ్రీ చదువుతోంది. అయితే కరోనా కారణంగా బలవంతంగా హాస్టల్ ఖాళీ చేయించింది యాజమాన్యం.
హాస్టల్ యాజమాన్యం వేధింపులతో డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన ఐశ్వర్య.. ఢిల్లీలో డిగ్రీ చదువుతోంది. అయితే కరోనా కారణంగా బలవంతంగా హాస్టల్ ఖాళీ చేయించింది యాజమాన్యం.
దాంతో స్వగ్రామానికి వచ్చిన ఐశ్వర్య .. ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. తమ కుమార్తె మరణానికి కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐశ్వర్య బీఎస్సీ మేథమేటిక్స్ చదువుతోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.