Asianet News TeluguAsianet News Telugu

కన్న కూతురికి కూల్ డ్రింక్ లో విషమిచ్చి... తండ్రి ఆత్మహత్య

కన్న కూతురికి కూతురుకి విషమిచ్చి చంపిన తండ్రి ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

daughter and father death in kamareddy
Author
Karimnagar, First Published Aug 6, 2020, 12:05 PM IST

కామారెడ్డి: కన్న కూతురికి కూతురుకి విషమిచ్చి చంపిన తండ్రి ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి కరోనా సృష్టించిన ఆర్థిక కష్టాలే కారణమని తెలుస్తోంది. 

ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోనని గుమస్తా కాలనీలో అక్బర్(48) కూతురు సైరా బేగం(14)లు ఇద్దరే వుంటున్నారు. అయితే ఇటీవల కరోనా విజృంభణ, లాక్ డౌన్ విధింపు కారణంగా అక్బర్ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఈ మధ్య ఆర్థిక ఇబ్బందులు మరీ ఎక్కువవడంతో అతడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.

ముందుగా కూతురు సైరా బేగంకు తండ్రి కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగించి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా తండ్రి కూతురు ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఆత్మహత్యలపై స్థానికులు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి రూరల్ పోలీసులు తెలిపారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios