Asianet News TeluguAsianet News Telugu

కించపరిచేందుకే శ్వేత పత్రాల పేరుతో కొత్త డ్రామా

తెలంగాణ అస్తిత్వాన్ని కించ పరిచేందుకే కాంగ్రెస్‌ శ్వేతపత్రాల పేరుతో కొత్త డ్రామాలకు తెరతీసిందని బీఆర్‌ఎస్‌ సీనియన్‌ నేత దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 
 

Dasoju Sravan SAYS Release White Paper on Congress govt plans for TELANGANA krj
Author
First Published Dec 23, 2023, 5:16 AM IST

తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, వర్గాల సంక్షేమం గురించి వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ శుక్రవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తూ.. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పరువు తీసే లక్ష్యంతో శ్వేతపత్రాలు విడుదల చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందనిశ్రవణ్ ప్రశ్నించారు. శ్వేతపత్రాలు విడుదల చేయడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం ప్రజలకు అర్థమవుతుందని అన్నారు.  విలేకరుల సమావేశాలు, సంబంధిత పత్రాలను విడుదల చేయడం ద్వారా కూడా అదే స్థాయిలో ప్రజల్లో చైతన్యం వచ్చి ఉండేదని ఆయన అన్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బిఆర్‌ఎస్‌ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పని చేసేందుకు కట్టుబడి ఉందని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, గత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ తప్పుడు సమాచారంతో శ్వేతపత్రాలు విడుదల చేసి విభజన రాజకీయాలకు పాల్పడుతోన్నారని శ్రవణ్ ఆరోపించారు.

రాజకీయ దుమారం రేపుతున్న కార్యక్రమాలకు బదులు భవిష్యత్‌ అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించాలని ఆయన ఉద్ఘాటించారు. కేసీఆర్ నాయకత్వంలో గత పాలనలో సృష్టించిన ఆస్తులను కూడా పరిగణనలోకి తీసుకునే సమతుల్య దృక్పథాన్ని కోరుతూ రుణ చర్చలకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని విమర్శించారు. కేసీఆర్ హయాంలో కూడబెట్టిన ప్రజా సంపదను ప్రస్తుత ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ప్రస్తుత విధానం వల్ల భవిష్యత్తులో రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు ఆటంకం కలుగుతుందని హెచ్చరించారు.

తెలంగాణకు అన్యాయాలు, వివక్షలు ఎదురవుతున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో సమైక్య ఆంధ్రప్రదేశ్‌ పాలనను కీర్తించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ‘‘మీ శ్వేతపత్రాలన్నీ కేవలం తెలంగాణ వ్యతిరేక, ఆంధ్రాకు అనుకూలమైనవి. తెలంగాణ ఏర్పాటుకు ముందు అంతా బాగుందని తప్పుడు అభిప్రాయాన్ని కల్పించేందుకు ఆంధ్రా మేధావులు సృష్టించారు’’ అని ఆరోపించారు.

ధరణి, రాయదుర్గం-ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ , ఫార్మా సిటీ వంటి ఆగిపోయిన ప్రాజెక్టుల గురించి ఆందోళనలను ఉటంకిస్తూ పరిపాలనా ప్రాధాన్యతలను మార్చాలని  శ్రవణ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతిపై దృష్టి సారించి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios