Asianet News TeluguAsianet News Telugu

శిల్పా చౌదరికి ఎట్టకేలకు బెయిల్.. రేపు విడుదలయ్యే అవకాశం

కిట్టీ పార్టీలు, పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశచూపి సీని, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన మాయలేడీ శిల్పా చౌదరికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. మూడు కేసుల్లో ఈ మేరకు కోర్ట్.. బెయిల్ మంజూరు చేసింది. 

court sanctioned bail for shilpa chowdary in cheating case
Author
Hyderabad, First Published Dec 23, 2021, 6:19 PM IST

కిట్టీ పార్టీలు, పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశచూపి సీని, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన మాయలేడీ శిల్పా చౌదరికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. మూడు కేసుల్లో ఈ మేరకు కోర్ట్.. బెయిల్ మంజూరు చేసింది. రేపు చంచల్ గూడ జైలు నుంచి శిల్ప విడుదలయ్యే అవకాశం వుంది. ఈ నెల 14న శిల్పకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్ట్. 

కాగా.. శిల్పా చౌదరికి (shilpa chowdary) డిసెంబర్ 16న బెయిల్ (bail) లభించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు (upparpally court) గత గురువారం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. వారిలో దివ్యారెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేసిన కేసులోనే శిల్పకు బెయిల్‌ మంజూరైంది. మరో రెండు కేసుల్లో బెయిల్‌ లభించలేదు. దీంతో ఆమె జైలులోనే వున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన కేసుల్లోనూ బెయిల్ కోరుతూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. 

ALso Read:శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు.. కానీ జైల్లోనే, ఎందుకంటే..?

గత మంగళవారం నాడు శిల్పా చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని... బ్యాంకు లాకర్లను తెరిచారు. అయితే అందులో నగదు లభ్యం కాలేదు. కస్టడీ పూర్తి కావడంతో బుధవారం ఉదయం ఉప్పర్‌పల్లి కోర్టులో నార్సింగి పోలీసులు ప్రవేశ పెట్టారు. దీంతో శిల్పా చౌదరికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు పోలీసులు.

అయితే ప్రముఖుల నుండి వసూలు చేసిన డబ్బులను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పెట్టుబడులుగా పెట్టినట్టుగా శిల్పా చౌదరి పోలీసుల విచారణలో వెల్లడించారని సమాచారం.  సినీ నటుల కుటుంబాలతో పాటు పోలీస్ అధికారులు, వీఐపీలను లక్ష్యంగా చేసుకొని  శిల్పా చౌదరి డబ్బులను వసూలు చేసిందని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios