జగిత్యాల పట్టణానికి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ శ్రీనుపై కొంతమంది హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనుపై కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు.
జగిత్యాల: జగిత్యాల పట్టణానికి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ శ్రీనుపై కొంతమంది హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనుపై కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు.
ఈ సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. కత్తి దాడితో కౌన్సిలర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది.
తెలిసినవారే ఈ దాడికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 17, 2019, 12:53 PM IST