తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది, తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 86 వేలమార్కును దాటింది. హైదరాబాదులో చాలా రోజుల తర్వాత తక్కువగా కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి సాగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో 2 వేలకు చేరువలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1931 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 86475కు చేరుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణలో గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 665కు చేరుకుంది. చాలా రోజుల తర్వాత హైదరాబాదులో తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 298 కేసులు నమోదయ్యాయి. 

జిల్లాలవారీగా గత 24 గంటల్లో తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

ఆదిలాబాద్ 28
భద్రాద్రి కొత్తగూడెం 39
జిహెచ్ఎంసి 298
జగిత్యాల 52 
జనగామ 59
జయశంకర్ భూపాలపల్లి 17 
జోగులాంబ గద్వాల 56
కామారెడ్డి 39
కరీంనగర్ 89
ఖమ్మం 73
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 3
మహబూబ్ నగర్ 43
మహబూబాబాద్ 34
మంచిర్యాల 45
మెదక్ 18
మేడ్చెల్ మల్కాజిగిరి 71
ములుగు 29
నాగర్ కర్నూలు 53
నల్లగొండ 84
నారాయణపేట 16
నిర్మల్ 24
నిజామాబాద్ 53
పెద్దపల్లి 64
రాజన్న సిరిసిల్ల 54
రంగారెడ్డి 124
సంగారెడ్డి 86
సిద్ధిపేట
సూర్యాపేట 64
వికారాబాద్ 19
వనపర్తి 38
వరంగల్ రూరల్ 26
వరంగల్ అర్బన్ 144
యాదాద్రి భువనగిరి 18 
మొత్తం 1931

Scroll to load tweet…