తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో శనివారం కొత్తగా 364 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంస్య 3.02 లక్షలకు చేరింది.
తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో శనివారం కొత్తగా 364 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంస్య 3.02 లక్షలకు చేరింది.
శుక్రవారం కరోనా వైరస్ తో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం 1,666 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2,607 యాక్టివ్ కేసులు ఉండగా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి 2.98 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా వైరస్ రాష్ట్రంలో మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.