Asianet News TeluguAsianet News Telugu

Telangana Congress politics: కౌన్ బనేగా తెలంగాణ రాజా, కౌన్ హై మంత్రి?

Telangana Congress: తెలంగాణలో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర సీఎం, మంత్రి వ‌ర్గ కూర్పు కోసం క‌స‌ర‌త్తులు చేస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం, ప‌లువురి పేర్లు ఉప ముఖ్య‌మంత్రులు, ఇత‌ర శాఖ మంత్రులుగా పేర్లు వినిపించాయి. కానీ,  ఈ అంశం ఢిల్లీకి చేరడంతో ఇంకా ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. 
 

Congress politics: Kaun Banega Telangana Raja, Kaun Hai Minister? Revanth Reddy Uttam Kumar Reddy, Bhatti Vikramarka RMA
Author
First Published Dec 5, 2023, 11:12 AM IST

Telangana Congress politics: తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేడి చ‌ల్లారింది. కానీ కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయ హీట్ మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి లభించడంతో ఇప్పుడు రాజకీయ సీన్ ఢిల్లీ వైపు మళ్లింది. ముఖ్యమంత్రి ఎవరు? ఆయన మంత్రివర్గంలో ఎవరు ఉంటారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాతి రోజు ముఖ్య‌మంత్రి ప‌ద‌వీ ప్ర‌మాణం ఉంటుంద‌ని కాంగ్రెస్ పార్టీలో హ‌డావిడి కొన‌సాగింది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు, ప‌లు చ‌ర్చ‌లు కొన‌సాగిన త‌ర్వాత ఇప్పుడు మొత్తం తెలంగాణ రాజ‌కీయం ఢిల్లీకి చేరుకుంది.

కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహించడం, పార్టీ అధిష్టానానికి నిర్ణయం తీసుకునే అధికారం ఇస్తూ ఏకపక్ష తీర్మానం చేయడం కాంగ్రెస్ లో ఆనవాయితీగా వస్తోందని ప‌లువురు నాయ‌కులు పేర్కొంటున్నారు. ఇదే స‌మ‌యంలో వివిధ పదవుల కోసం జోరుగా లాబీయింగ్ జరుగుతోంది. ఈసారి ముఖ్యమంత్రి పేరును ప్రకటించడంతో పాటు, కులం, వర్గం వంటి సమీకరణాల ఆధారంగా మంత్రివర్గం జాబితాను కూడా అధిష్టానం ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీకి విధేయత, పార్టీలోకి వచ్చిన వారిలో కొందరికి టికెట్లు ఇచ్చి గెలిపించిన హామీలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ విష‌యంలో నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని పార్టీలోని ప‌లు వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఒక సీపీఐ నాయ‌కుడితో పాటు మొత్తం 65 మందిలో 62 మంది శాసనసభ్యులు రేవంత్ నాయకత్వానికి అంగీకరించడంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఎ.రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంచుకున్నట్లు సోమవారం జరిగిన అన్ని పరిణామాలు సూచిస్తున్నాయి. సాయంత్రానికల్లా ఆయన పేరును ప్రకటిస్తారనీ, ఆ వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తారని భావించారు. అయితే మంగళవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ పరిశీలకులందరితో సమావేశం నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. అంతకుముందు ఖర్గే, కెసి వేణుగోపాల్ లు సోనియా గాంధీని కలిశారు.

రేవంత్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క కూడా సీఎం రేసులో ఉన్నారు. రేవంత్ కేబినెట్లో పనిచేయడానికి ఉత్తమ్ అంగీకరించకపోవచ్చు కాబట్టి ఆయన సతీమణి పద్మావతిని మంత్రివర్గంలోకి తీసుకుని ఉత్తమ్ ను మళ్లీ లోక్ స‌భ‌కు పంపే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు పేర్కొంటుండ‌టంతో ఉత్త‌మ్ సీఎం రేసు నుంచి ప‌క్క‌కు జ‌రిపే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇదే జ‌ర‌గిగే ఉత్త‌మ్ ఏ విధంగా స్పందిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. భట్టి, సీతక్క (ఎస్సీ)లను డిప్యూటీ సీఎంలుగా నియమించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రిని మినహాయిస్తే మంత్రివర్గ పరిమాణం 17కు మించకూడదు. దీంతో మంత్రుల ఎంపిక కష్టంగా మారే ఆవ‌కాశం కూడా ఉంది.

ఆయా స‌మాజిక వ‌ర్గాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే, తుమ్మల నాగేశ్వరరావు (కమ్మ), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల‌కు మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించ‌డంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవలి కాలంలో పార్టీలో చేరినా ఖమ్మం జిల్లాలో స్వీప్ లకు వారే కారణం.  అదేవిధంగా వరంగల్ కు చెందిన కొండా సురేఖ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఈ జిల్లాలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో డి.శ్రీధర్ బాబు (బ్రాహ్మణుడు), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (విధేయుడు, సీనియర్ నేత), మల్ రెడ్డి రంగారెడ్డి లేదా రామ్మోహన్ రెడ్డి ఆర్ ఆర్ జిల్లా నుంచి మంత్రుల బరిలో ఉన్నార‌నే టాక్ న‌డుస్తోంది. తెలంగాణలో ప్రధాన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ముదిరాజ్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరిని కూడా పార్టీ మంత్రివ‌ర్గంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే మంత్రివర్గంలోకి తీసుకోలేని ఇతర ఆశావహులకు విప్, చీఫ్ విప్ లేదా స్పీకర్ పదవులు ఇవ్వవచ్చున‌నే చ‌ర్చ సాగుతోంది. మ‌రి కాంగ్రెస్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి !

Follow Us:
Download App:
  • android
  • ios