రాహుల్ గాంధీపై సినీనటుడు ప్రకాష్రాజ్ చేసిన వ్యాఖ్యలపై టీ.కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తొలుత జగ్గారెడ్డి, అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఆయనపై ఫైరయ్యారు. రాజ్యసభ సీటు కోసం, కేసీఆర్ మెప్పు కోసమే రాహుల్పై ప్రకాష్ రాజ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినీనటుడు ప్రకాష్ రాజ్పై (prakash raj) ఘాటు వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ (tpcc) మాజీ చీఫ్, కాంగ్రెస్ (congress) ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy) . ప్రకాష్ రాజ్ ఒక బఫూన్ అని.. ఆయన అంత మొనగాడైతే ‘‘మా’’ ఎన్నికల్లో (maa elections) ఎందుకు ఓడిపోతాడని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ (kcr) మెప్పు కోసమే ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని.. రాజ్యసభ సీటు ఇస్తారని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. రెండ్రోజుల రాహుల్ టూర్ జోష్ నింపిందని.. పనిచేసేవారికే టికెట్లు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఆర్నెళ్ల ముందే అభ్యర్ధులను ప్రకటిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
అంతకుముందు ప్రకాష్ రాజ్పై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (jagga reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్కు సినిమాలు లేవని.. గ్లామర్ అవుట్ అయిపోయిందని విమర్శించారు. జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రకాష్ రాజ్ ట్వీట్ గురించి మీడియా ప్రస్తావించగా.. జగ్గారెడ్డి ప్రకాష్ రాజ్పై నిప్పులు చెరిగారు.
ప్రకాష్ రాజ్కు సినిమాలు లేవని.. సినిమా వాళ్లకు ఇదో తమాషా అయిపోందని మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ గ్లామర్ అవుట్ అయిపోందని.. ఈజీగా రాజ్యసభ ఎక్కడ వస్తుందో అక్కడి చేరాడని అన్నారు. ప్రకాశ్ రాజ్.. ఒక్క రోజు కూడా పబ్లిక్లోకి వచ్చింది లేదన్నారు. ప్రకాష్ రాజ్కు కేసీఆర్ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ఇదే ప్రకాష్ రాజు కేసీఆర్ను తిడుతారని.. ఆ రోజు వస్తుందన్నారు.
ఇంకా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పంజాబ్ను (punjab) ఎన్నో ఏళ్లు కాంగ్రెస్ పాలించిందని.. ఒక్కసారి ఓడిపోయినంతా మాత్రాన పని అయిపోయిందని అనడం సరికాదన్నారు. రాహుల్ వరంగల్ సభ మెసేజ్ ప్రజల్లోకి పోవద్దని.. ఫస్ట్ పేజీల్లో అన్ని పేపర్లకు యాడ్స్ ఇచ్చారని మండిపడ్డారు. ఇది టీఆర్ఎస్ చేతకానితనానికి నిదర్శనం అని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా పనికిరారని విమర్శించారు. ఢిల్లీ నుంచి స్ట్రిప్ట్ రాసిస్తే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చదువుతున్నాడని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పారు.
రేపటి నుంచి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మీద యుద్దమే అని చెప్పారు. రాహుల్ గాంధీ చెప్పిన ప్రతి ఒక్క హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని చెప్పారు. రాహుల్ మెసేజ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని చెప్పారు. ఇప్పుడు అనాల్సిందేనని.. జై తెలంగాణ కాదని.. జై రైతు అనాలి అన్నారు. ఇంకా రాజకీయం కోసం జై తెలంగాణ నినాదమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు సమైక్యాంధ్ర అన్న వ్యక్తులు నేడు కేసీఆర్ కేబినెట్లో ఉన్నారని విమర్శించారు.
