Asianet News TeluguAsianet News Telugu

రేపు మేడిగడ్డకు రాహుల్ గాంధీ .. బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించే ఛాన్స్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను సందర్శించనున్నారు. ప్రాజెక్ట్ వద్ద పిల్లర్లు కుంగిన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతానికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. అలాంటిది రాహుల్‌ను , ఇతర కాంగ్రెస్ నేతలను ఆ ప్రాంతానికి అనుమతిస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

congress leader rahul gandhi to visit medigadda barrage tomorrow ksp
Author
First Published Nov 1, 2023, 8:14 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను సందర్శించనున్నారు. హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన అంబటిపల్లి నుంచి మేడిగడ్డకు రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 

Also Read: తెలంగాణలో వాళ్లకి పడేదే 2 శాతం ఓట్లు .. ఓబీసీని సీఎంగా ఎలా సాధ్యం : బీజేపీకి రాహుల్ గాంధీ చురకలు

అయితే మేడిగడ్డ ప్రాంతంలో రాహుల్ పర్యటన కొనసాగుతుందా.. లేదా అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ప్రాజెక్ట్ వద్ద పిల్లర్లు కుంగిన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతానికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. అలాంటిది రాహుల్‌ను , ఇతర కాంగ్రెస్ నేతలను ఆ ప్రాంతానికి అనుమతిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. రేపు ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకు అంబటిపల్లి గ్రామంలో రాహుల్ గాంధీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో రాహుల్‌తో పాటు రేవంత్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తదితరులు ఆ భేటీలో పాల్గొననున్నారు. సుమారు 5 వేల మంది మహిళలతో ఈ సభ జరగనుంది.. ఆరు గ్యారెంటీ పథకాలపై మహిళలకు రాహుల్ వివరించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios