అజహరుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ అధిష్టానం తనకు అవకాశమిస్తే కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడానికి సిద్ధమని ప్రకటించారు.  

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశమిస్తే.. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. శుక్రవారం ఆయన కామారెడ్డి పర్యటనలో ఉన్నారు. లింగంపేటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనకు అవకాశం ఇస్తే కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన తొక్కిసలాట సమయంలో అజహరుద్దీన్ పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అజహరుద్దీన్ అందులో తన తప్పు లేదని అన్నారు. జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాటలో తన తప్పుంటే అరెస్ట్ చేసుకోవచ్చని హెచ్ సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ చెప్పారు. జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాటలో తమ తప్పు లేదన్నారు. . తాను తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఏం తప్పు చేశానో చెప్పాలని అజహరుద్దీన్ ప్రశ్నించారు. ఆ తొక్కిసలాట దురదృష్టకరం పేర్కొన్నారు.