Kodad: కోదాడలో వెనుకబాటుకు కాంగ్రెస్ కారణమని ఆరోపించిన భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్).. విజ్ఞతతో ఓటు వేయాలనీ, దీనికి ముందు ప్ర‌జ‌లు ఒక‌సారి ఆలోచించాల‌ని అన్నారు. గతంలో కోదాడ ప్రజలు ముఖ్యంగా వ్యవసాయ అవసరాలకు నీటి ఎద్దడి విషయంలో పడిన కష్టాలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 

Telangana Chief Minister K Chandrasekhar Rao: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ప్రసంగిస్తూ.. విజ్ఞతతో ఓటు వేయాలనీ, దీనికి ముందు ప్ర‌జ‌లు ఒక‌సారి ఆలోచించాల‌ని అన్నారు. గతంలో కోదాడ ప్రజలు ముఖ్యంగా వ్యవసాయ అవసరాలకు నీటి ఎద్దడి విషయంలో పడిన పోరాటాలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్ర‌జ‌లు తెలివిగా ఓటు వేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ప్రజలు తమ నిర్ణయం తీసుకునే ముందు ఒక‌సారి ఆలోచించాలని కోరుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ ఒక శక్తివంతమైన సాధనమనీ, ప్రజలు తమ ఓటును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గతంలో కోదాడ ప్రజలు ముఖ్యంగా వ్యవసాయ అవసరాల కోసం నీటి ఎద్దడితో పడిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ 2003లో నాగార్జునసాగర్ డ్యాం వద్ద తక్షణమే నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికుల బృందంతో కలిసి నిరసన తెలిపిన తీరును ఎత్తిచూపారు. నిజాం పాలన నుంచి తెలంగాణను ఎలా విడదీసి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలో ఆంధ్రాలో విలీనం చేశారంటూ ముఖ్యమంత్రి విమర్శించారు. తెలంగాణ వ్యవసాయ అవసరాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసి ఆంధ్రాకు నీటిని మళ్లిస్తోందని ఆరోపించిన ఆయన, ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మౌనం వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పాలకుల కుట్రలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వారి చర్యల పర్యవసానాలను తెలంగాణ ఇప్పుడు అనుభవిస్తోందని అన్నారు. ఓటు ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన సీఎం కేసీఆర్ రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజలు ఎన్నుకోవాలని కోరారు. తెలంగాణ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే కర్ణాటకలో ఐదు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పడానికి సిగ్గులేదా అంటూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.