Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 22న వాసాలమర్రికి కేసీఆర్: సహపంక్తి భోజనం చేద్దాం.. సర్పంచ్‌కి ఫోన్‌ చేసిన సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని వాసాల‌మ‌ర్రిలో పర్యటించనున్నారు.  కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి ఏర్పాట్లను ప‌రిశీలించారు. వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ ద‌త్త‌త తీసుకున్న విష‌యం తెలిసిందే

cm kcr will go to vasalamarri on june 22 ksp
Author
Hyderabad, First Published Jun 18, 2021, 2:51 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని వాసాల‌మ‌ర్రిలో పర్యటించనున్నారు.  కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి ఏర్పాట్లను ప‌రిశీలించారు. వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ ద‌త్త‌త తీసుకున్న విష‌యం తెలిసిందే. గ‌తేడాది న‌వంబ‌ర్ నెల‌లో జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన సీఎం కేసీఆర్ తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఆగి, గ్రామాభివృద్ధిపై స్థానికుల‌తో చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వాసాలమర్రి సర్పంచ్‌ ఆంజయ్యతో ఫోన్‌లో మాట్లాడారు సీఎం కేసీఆర్. ఊరంతా సామూహిక భోజనం చేద్దామని సర్పంచ్‌కు చెప్పారు కేసీఆర్. గ్రామసభ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిద్దామని సీఎం అన్నారు. 

Also Read:ఎన్టీఆర్, కేసీఆర్ రాజకీయాలు: ఈటల రాజేందర్ ఎగ్జిట్ వెనక

Follow Us:
Download App:
  • android
  • ios