తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో వరంగల్ బయలుదేరి వెళ్లనున్నారు. రోడ్డు మార్గంలో ఆయన వరంగల్కు చేరుకుంటారు. రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో వరంగల్ బయలుదేరి వెళ్లనున్నారు. రోడ్డు మార్గంలో ఆయన వరంగల్కు చేరుకుంటారు. ఈ రోజు సాయంత్రం వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేసీఆర్ భేటీ కానున్నారు. రాత్రికి వరంగల్లోనే బస చేయనున్నారు. రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్న సీఎం కేసీఆర్.. వరంగల్ నుంచే తన పర్యటనను ప్రారంభించనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద నష్టాన్ని కేసీఆర్ పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయో సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. సహాయక చర్యలు ఎలా కొసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. వరద బాధితులతో కేసీఆర్ ప్రత్యక్షంగా మాట్లాడి వారి కష్టాలను తెలుసుకోనున్నారు. అలాగే సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు అధికారులకు ఆదేశాలు జరీ చేసే అవకాశం ఉంది. అవసరమైన మేరకు సహాయాన్ని ప్రకటించి బాధితులకు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్తో పాటుగా సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర అధికారులు ఈ ఏరియల్ సర్వేలో పాల్గొనున్నారు.
ఇక, వారం రోజులు పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు కొంత వరద ఉధృతి తగ్గినప్పటికీ.. భద్రాచలం వద్ద మాత్రం గోదావరిలో వదర ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 71.00 అడుగులకు చేరింది. ప్రస్తుతం గోదావరిలో 24,29,246 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరివాహక ప్రాంతంలోని వరద ఉద్ధృతికి 95 గ్రామాలు నీటమునిగాయి.
