Asianet News TeluguAsianet News Telugu

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఆదేశం.. ఎవరా లక్కీ పర్సన్స్.. ?

తెలంగాణ రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిగిలిన నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

CM KCR's order appointing chairmen for four corporations KRJ
Author
First Published Oct 6, 2023, 2:13 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.

సీఎం నిర్ణయం ప్రకారం 'తెలంగాణ రైతుబంధు సమితి' ఛైర్మన్ గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, 'టీఎస్ ఆర్టీసీ' ఛైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, 'మిషన్ భగీరథ' వైస్ ఛైర్మన్ గా ఉప్పల వెంకటేష్ గుప్తా, 'ఎంబీసీ కార్పొరేషన్' ఛైర్మన్ గా  నందికంటి శ్రీధర్ లు నియమితులు అయ్యారు. వీళ్ల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios