Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సిన్: సోమవారం మంత్రులు, కలెక్టర్లతో కేసీఆర్ భేటీ

11న మంత్రులు, కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, సాదా బైనామాలపై నిర్ణయం తీసుకోనున్నారు

cm kcr meet collectors and ministers on monday over coronavirus vaccine ksp
Author
Hyderabad, First Published Jan 8, 2021, 7:24 PM IST

11న మంత్రులు, కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, సాదా బైనామాలపై నిర్ణయం తీసుకోనున్నారు. దీనితో పాటు కరోనా వ్యాక్సిన్ పంపిణీపైన చర్చించనున్నారు. విద్యా సంస్థల ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు కేసీఆర్.

కాగా, కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ నేపథ్యంలో ఈ నెల 11న సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీకానున్నారు. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సాయంత్రం 4 గంటలకు సమావేశం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. టీకా పంపిణీ, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు వంటి ప్రధాన అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios