Asianet News TeluguAsianet News Telugu

బోర్డు తిప్పేసిన మరో చిట్‌ఫండ్ కంపెనీ

రిషబ్ చిట్‌ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చిట్టీల పేరుతో రూ.200 కోట్లు వసూలు చేసిన ప్రజలను మోసం చేసిన ఘటన మరచిపోకముందే తెలంగాణలో మరో చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. 

chitfund company cheating in Khammam district
Author
Hyderabad, First Published Dec 21, 2018, 10:11 AM IST

రిషబ్ చిట్‌ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చిట్టీల పేరుతో రూ.200 కోట్లు వసూలు చేసిన ప్రజలను మోసం చేసిన ఘటన మరచిపోకముందే తెలంగాణలో మరో చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఖమ్మం జిల్లా వైరా కేంద్రంగా కొనసాగుతున్న శ్రేష్ట చిట్‌ఫండ్ కంపెనీ చిట్టీల పేరిట కోట్ల రూపాయలను వసూలు చేసి మోసానికి పాల్పడింది.

నాగబత్తిన క్రాంతికుమార్ వైరా మండలంలో గత కొన్నేళ్లుగా ఈ కంపెనీని నిర్వహిస్తున్నాడు. జనానికి బాగా నమ్మకం కుదిరాక తన అసలు రూపాన్ని చూపించాడు. జనం చెల్లించిన డబ్బు చెల్లించలేనంటూ రూ.4.58 కోట్లకు ఐపీ పెట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios