Asianet News TeluguAsianet News Telugu

బాబా అవతారంలో మోసాలు.. దృష్టి మరల్చి దోపిడీ.. ఘరానా ముఠాల అరెస్ట్..

బాబా అవతారంలో మోసాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకులను తప్పుదోవ పట్టిస్తూ, దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నాగపూర్ కు చెందిన సలీమ్ అలీ (60), మహమ్మద్‌ సాదిఖ్‌ (24), ఖుర్బాన్‌ అలీ (23)లతో పాటు మరో ఇద్దరు కలిసి ఓ ముఠాగా తయారయ్యారు. 

cheating in baba getup, hyd police arrested 2 gangs - bsb
Author
Hyderabad, First Published Feb 20, 2021, 9:22 AM IST

బాబా అవతారంలో మోసాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకులను తప్పుదోవ పట్టిస్తూ, దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నాగపూర్ కు చెందిన సలీమ్ అలీ (60), మహమ్మద్‌ సాదిఖ్‌ (24), ఖుర్బాన్‌ అలీ (23)లతో పాటు మరో ఇద్దరు కలిసి ఓ ముఠాగా తయారయ్యారు. 

ఈ గ్యాంగ్ కు సలీం లీడర్. సలీమ్ 1993 నుంచే నేరాల బాట పట్టాడు. దృష్టి మరల్చి మోసాలకు పాల్పడటంలో నేర్పరి. తన బంధుమిత్రులను తన గ్యాంగులో చేర్చుకుని మోసాలు చేస్తుంటాడు. ఇప్పటివరకు మహారాష్ట్రలోని కోత్వాలి, గిట్టిఖదన్, పైఢోనీ పోలీస్ స్టేషన్లతో పాటు హైదరాబాద్ లో ఉప్పల్‌, మార్కెట్‌ పీఎస్‌లలో సలీం మీద పలు కేసులు ఉన్నాయి. 

ఈ గ్యాంగు సభ్యులు టార్గెట్ చేసుకున్న ప్రాంతాలకు వెళ్లి అక్కడి వ్యాపార సముదాయాలకు దగ్గర్లో, తక్కువ ఖర్చులో ఉండే లాడ్జీల్లో బస చేస్తుంటారు. అక్కడే బాబా అవతారంలో అమాయకులను తమ బుట్టలోకి దించుతారు. సలీం బాబా వేషం వేసుకుని తన దగ్గర శక్తి ఉందని నమ్మిస్తాడు.

అతనితో పాటు ఉన్న మిగతా ఇద్దరు తాము కూడా సమస్యలతో వచ్చాయని అక్కడి వారిని నమ్మిస్తారు. బాబా వద్దకు వచ్చేవారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఆయా సమస్యలను కోడ్ భాషలో బాబాకు తెలియజేస్తారు. బాబా తన దగ్గర అతీంద్రీయ శక్తులున్నట్లు నటిస్తాడు. దీంతో వారు తమ సమస్యల గురించి ప్రస్తావించగానే బాధితులకు నమ్మకం పెరుగుతుంది. 

ఇదే ఆశతో వారిని పూర్తిగా బుట్టలోకి దించడం.. బాబా ఆశీస్సులు తీసుకోవాలంటూ నమ్మిస్తారు. వారి దగ్గరున్న విలువైన వస్తువులు తీసుకుని పరారవుతుంటారు. పక్కా సమచారం మేరకు నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

దృష్టి మరల్చి మోసాలకు పాల్పడటంతో పాటు ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. హబీబ్‌ ముస్తఫా అనే ఇతని మీద కూడా 15 నాన్‌బెయిలబుల్‌ వారంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. హబీబ్ చోరీల్లో ఆరితేరాడు. ఇతని అరెస్టుతో 15 చోరీ కేసుల చిక్కుముడి వీడింది. 

శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. మాదన్నపేట్ ప్రాంతానికి చెందిన హబీబ్ (44) అలియాస్‌ దిలావర్‌ ఖాన్‌ మెకానిక్ గా పనిచేసేవాడు. ఇప్పటివరకు 42 చోరీ కేసుల్లో నిందితుడు. ఇతనితో పాటు అంతరాష్ట్ర ముఠా నుంచి సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రూ. 20లక్షలు విలువ చేసే 290 గ్రాములు బంగారం, 217 గ్రాముల వెండి ఆభరణాలు, 3 మోటార్‌ సైకిళ్లు, 2ఎల్‌ఈడీ టీవీలు స్వాధీనం చేసుకున్నారు. చాంద్రాయణగుట్ట పోలీసులతో కలిసి సౌత్ జోన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ద్వారా ఈ రెండు గ్యాగుల ఆట కట్టించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios