మునుగోడులో టీఆర్ఎస్కు సీపీఐ మద్దతుపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. మునుగోడులో టీఆర్ఎస్కే తమ పార్టీ మద్దతిస్తోందని స్పష్టం చేశారు.
మునుగోడులో టీఆర్ఎస్కు సీపీఐ మద్దతుపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. మునుగోడులో టీఆర్ఎస్కే తమ పార్టీ మద్దతిస్తోందని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి స్వార్ధం కోసమే రాజీనామా చేసి.. పార్టీ మారుతున్నారని ఆరోపించారు. బీజేపీని ఓడించే పార్టీ తమ మద్దతివ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉప ఎన్నికలో సీపీఐ నిలబడే పరిస్థితి లేదన్నారు. బీజేపీని ఓడించే సత్తా టీఆర్ఎస్కే ఉందని చెప్పారు.. మునుగోడుకే పరిమితం కాకుండా.. భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్తో కలిసి ముందుకు సాగాలనే భావనలో ఉన్నట్టుగా తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యచరణ రచిస్తామని చెప్పారు. బీజీపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉందన్నారు. అందుకే బీజేపీకి మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు.
2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తమ పార్టీని ఇబ్బంది పెట్టిందని అన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తమ పార్టీకి ఇచ్చిన మూడు సీట్లలో కూడా పోటీ చేసిందని అన్నారు. అప్పడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇబ్బంది పెట్టారని చెప్పారు. మునుగోడులో నేడు జరిగే టీఆర్ఎస్ సభకు రావాలని కేసీఆర్ తమను ఆహ్వానించారని చెప్పారు. మునుగోడు సభకు సీపీఐ నేతలు వెళ్తున్నారని తెలిపారు.
