Telangana: ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ స‌ర్కారుపై తెలంగాణ ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు మ‌రోసారి ఫైర్ అయ్యారు. కేంద్ర స‌ర్కారు ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త రాష్ట్రాలను వేరుగా చూస్తూ.. రెండు పాల‌సీల‌ను అమ‌లు చేస్తున్న‌ద‌ని ఆరోపిస్తూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

Telangana: పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లపై తెలంగాణలో నిర‌స‌న‌ల హోరు కొన‌సాగుతోంది. తెలంగాణ లోని చాలా ప్రాంతాల్లో బీజేపీ, ప్ర‌ధాని మోడీకి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. పార్లమెంట్‌లో తెలంగాణ (Telangana) ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఇప్ప‌టికే తెలంగాణ కీల‌క నేత‌లు, ప‌లువురు మంత్రులు కేంద్రంలోని బీజేపీ, ప్ర‌ధాని మోడీ తీరును ఖండిస్తూ.. ఆ వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకోవాల‌నీ, క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ.హ‌రీష్ రావు కేంద్రం (central government)పై మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉత్తరాదికి ఒకటి, దక్షిణాది రాష్ట్రాలకు మరోకటి అనేలా రెండు విధానాలను అనుసరిస్తోందని హరీశ్‌రావు (T Harish Rao) విమర్శించారు.

రూ.1.71 కోట్లతో డివిజనల్ ఇంజినీర్ భవనం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ ప్రజలు తమ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సిద్దిపేట లేదా కరీంనగర్‌కు వెళ్లాల్సి వచ్చింది. కానీ హుస్నాబాద్‌లో రూ.50 కోట్లతో 220/132 కేవీ సబ్‌స్టేషన్‌కు మంజూరైంది. మార్చి 31లోగా సబ్‌స్టేషన్‌ను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే, పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎఫ్‌సిఐకి రూ.40,000 కోట్లు తగ్గించారు. రైతులకు సబ్సిడీలు తగ్గడంతో భవిష్యత్తులో వరి సేకరణ కూడా తగ్గే అవకాశం ఉంది అని అన్నారు. 

ఉత్తర భారతదేశంలో యూరియా, DAP ఎక్కువగా వ్యవసాయానికి ఉపయోగించబడుతుంది, అయితే దక్షిణ భారతదేశంలో కాంప్లెక్స్ ఎరువులు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. యూపీ ఎన్నికల దృష్ట్యా యూరియా, డీఏపీ ధరలు పెంచలేదని, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెంచార‌ని హ‌రీష్ రావు అన్నారు. “రాష్ట్రాలకు 4% ఉన్న GSDP రుణ సౌకర్యాలు 3.5%కి తగ్గించబడ్డాయి. మిగిలిన 0. 5% పొందేందుకు రాష్ట్రాలను విద్యుత్ సంస్కరణల కోసం ఒత్తిడి తెస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కరణలు చేపడితే కేంద్రం నుంచి రూ.5000 కోట్లు రాబట్టవచ్చు కానీ వ్యవసాయ బావులకు విద్యుత్ మీటర్లు బిగించాల్సిన అవసరం ఉన్నందున అందుకు సిద్ధంగా లేర‌ని హ‌రీష్ రావు అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ కోసం రూ.12,000 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వం విద్యుత్ సంస్క‌రణ‌ల పేరిట రైతుల‌పై భారం మోపేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ద‌ని తెలిపారు. రాష్ట్రాల‌పై కూడా దీనికి అనుగుణంగా ఒత్తిడి తీసుకువ‌స్తున్న‌ద‌ని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం (central government) రైతులకు సబ్సిడీలను తగ్గించి వంటగ్యాస్ ధరలను పెంచిందని హ‌రీష్ రావు విమర్శించారు. ఇదిలావుండ‌గా, ప్ర‌ధాని మోడీ వ్యాఖ్య‌లపై తెలంగాణ ఎంపీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కోట్లాది తెలంగాణ ప్రజల పోరాటాన్ని ప్రధాని మోడీ అవమానించారని తెరాస ఎంపీలు మండిప‌డ్డారు. ఏడేండ్ల‌ క్రితం సాధించుకున్న తెలంగాణ గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ విభజన బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. లాఠీఛార్జ్, కాల్పుల వంటి ఘటనలేవీ జరగకుండా కేవలం రాష్ట్ర ప్రజల పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నామని స్పష్టం చేశారు. మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద తెరాస ఎంపీలు నిరసన తెలిపారు.