Asianet News TeluguAsianet News Telugu

ఇప్పటివరకు వ్యాక్సిన్ ఒక్కడోసూ తీసుకోనివారికే ప్రమాదం.. సీసీఎంబీ డైరెక్టర్...

ఒమిక్రాన్ అయినా మరోటైనా టీకా ఒక్కడోసు కూడా తీసుకొనివారికి అధిక ముప్పు ఉంటుంది. పెద్దల్లో ముఖ్యంగా ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న వారికీ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కోవిడ్ రెండు టీకాలు వేయించుకున్న వారికి ఆ ప్రమాదం తక్కువ. ఒక డోసు టీకా తీసుకున్న వారితో పోలిస్తే రెండురోజులు తీసుకున్న వారికి రక్షణ ఎక్కువ అని చెప్పుకొచ్చారు.

CCMB Director comments on Omicron Variant and Vaccination
Author
Hyderabad, First Published Dec 6, 2021, 10:20 AM IST

హైదరాబాద్ :  కోవిడ్ లో కొత్త రకం ఒమిక్రాన్ గురించి ఓ అంచనాకు రావాలంటే వాస్తవిక సమాచారం (రియల్ టైం డాటా)అందుబాటులోకి రావాల్సి ఉందని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ వస్తున్న విదేశీ ప్రయాణికుల్లో  పాజిటివ్గా తేలిన వారి నమూనాలు  తమకు చేరుతున్నాయి అని ఆయన తెలిపారు.

వీటి జన్యుక్రమాలను కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు ఉన్నట్లు వివరించారు. ఒమిక్రాన్ వ్యాప్తిపై భయాందోళనలు రేగుతున్న నేపథ్యంలో ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు…

CCMBకి వస్తున్న నమూనాల వైరస్ జన్యుపరమైన ఆవిష్కరణలో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా చిన్న యంత్రం నానో పై  వాటి జన్యు క్రమాలను కనుగొంటున్నామని, ఇందుకు 48 గంటల సమయం పడుతుందని తెలిపారు. ఫలితం రాగానే వెల్లడిస్తాం నమూనాలు పెరిగేకొద్దీ పెద్ద యంత్రంపై 
Geneticsను కనుగొనే ప్రక్రియ చేపడతాం .

Omicron Variant అయినా మరోటైనా టీకా ఒక్కడోసు కూడా తీసుకొనివారికి అధిక ముప్పు ఉంటుంది. పెద్దల్లో ముఖ్యంగా ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న వారికీ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కోవిడ్ రెండు టీకాలు వేయించుకున్న వారికి ఆ ప్రమాదం తక్కువ. ఒక డోసు టీకా తీసుకున్న వారితో పోలిస్తే రెండురోజులు తీసుకున్న వారికి రక్షణ ఎక్కువ అని చెప్పుకొచ్చారు.

ఒమిక్రాన్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది యువకులు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. సహజంగానే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండే యువకుల్లో వైరస్ లక్షణాలు తక్కువ ఉంటాయి. అలాగని ఒమిక్రాన్ తో పెద్దగా ముప్పు లేదని అప్పుడే నిర్ధారణకు రాలేం అన్నారు. లక్షణాలు తక్కువ అని చెప్పలేం జరగాల్సి ఉందని ఒమిక్రాన్ తో మూడోవేవ్ మహమ్మారి దశ ముగియనుందా... అనేది చెప్పలేమని అన్నారు.

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడో మొదలైందని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో.. ఆయన మాట్లాడుతూ  ఇలా ఊహించి చెప్పలేమన్నారు. జనాభాలో ఇప్పటికే 70 శాతం ఉంటే... మిగతా 30 శాతం జనాభాకు సోకే అవకాశం ఉంది. టీకా వేసుకున్నాక కూడా కొందరిలో పాజిటివ్ రావచ్చు. అంతా జాగ్రత్తలు పాటించాల్సిందే చేయించుకోవాల్సిందే అన్నారు.

Omicron: భారత్‌లో ఒమిక్రాన్ తుఫాను.. రాజస్థాన్‌లో కొత్తగా 9 మందికి గుర్తింపు, దేశంలో 21కి చేరిన సంఖ్య

నవంబర్ 15 వరకు వచ్చిన నమూనాల్లో 80 నుంచి 90 శాతం వరకు డెల్టా, అందులోని ఉపరకాలే కనిపించాయని మిగిలిన వాటి ఫలితాలు రావాల్సి ఉందన్నారు. కొత్తరకం వైరస్ లో స్పైక్ ప్రోటీన్ లో 32 ఉత్పరివర్తనాల కారణంగా అది రోగనిరోధకశక్తి నుంచి తప్పించుకుంటుందని అంచనాలున్నాయి. వాస్తవిక సమాచారం ఆధారంగా అధ్యయనం చేస్తే తప్ప అది ప్రమాదకారినా.. కాదా.. అనేది చెప్పలేం.. వీటిపై ఊహాగానాలు తగదు.

బూస్టర్ డోస్  గురించి మాట్లాడుతూ... 
మన దేశ జనాభా సుమారు 130 కోట్లు. ఇంకా అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. రెండో డోసు చాలామంది వేయించుకోవాలి ఉంది. ఇది మన మొదటి ప్రాధాన్యత, తర్వాత 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు ఇవ్వాల్సి ఉంది. బూస్టర్ డోసుపై ప్రభుత్వ ప్రాధాన్యాలు బట్టి నిర్ణయం తీసుకుంటుంది. దేశాలతో పోలిస్తే మన భిన్నమైన పరిస్థితులు అని చెప్పుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios