రేపు కేబినెట్ భేటీ
- పెద్ద నోట్ల రద్దుపైనే చర్చ?
తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో తాజా పరిమాణాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.
ప్రజలు చిల్లర కోసం పడుతున్న కష్టాలను, నోట్ల ను అందుబాటులో ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.శనివారం హైదరాబాద్కు ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ శంషాబాద్ ఎయిర్పోర్టులో కలిసిన సంగతి తెలిసిందే.
పెద్ద నోట్ల రద్దు వల్ల తెలంగాణ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ ప్రధానితో చర్చించినట్టు సమాచారం.