బీజేపీ అధికారంలోకి రాగానే.. ప్రగతిభవన్ ను లక్ష నాగళ్లతో దున్ని,పేదలకు పంచుతాం.. బండిసంజయ్
‘ప్రగతిభవన్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతాం. తొలి సంతకం ఈ ఫైలు పైనే చేస్తాం. ఓట్లు కొనుగోలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్... ఫేక్ ఐడి లు సృష్టించి దళితులను మోసం చేస్తున్నారు. బీసీ సబ్ ప్లాన్, ఆత్మగౌరవ భవనాలు ఎక్కడికి పోయాయి?.. రాష్ట్రంలో అన్ని కులవృత్తులను కెసిఆర్ నాశనం చేశారు.
2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రాగానే ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భాజపా ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జరిగిన బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో బండి సంజయ్ మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కి భయం పట్టుకుంది. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సీఎంకు దళితులు, గిరిజనులపై చిత్తశుద్ధి లేదు. మూడెకరాల భూమి ఇస్తానన్న కెసీఆర్ ఒక్కొక్క దళితుడికి రూ. 10 లక్షలు కాదు.. రూ.30 లక్షలు ఇవ్వాలి. 18 శాతం దళితుల్లో ఏ ఒక్కరికీ ముఖ్యమంత్రిగా పనిచేసే అర్హత లేదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
‘ప్రగతిభవన్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతాం. తొలి సంతకం ఈ ఫైలు పైనే చేస్తాం. ఓట్లు కొనుగోలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్... ఫేక్ ఐడి లు సృష్టించి దళితులను మోసం చేస్తున్నారు. బీసీ సబ్ ప్లాన్, ఆత్మగౌరవ భవనాలు ఎక్కడికి పోయాయి?.. రాష్ట్రంలో అన్ని కులవృత్తులను కెసిఆర్ నాశనం చేశారు.
ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 10 వేల డబ్బులతో ఉద్యమిస్తాం.. 27 మంది ఓబీసీలను, 12 మంది ఎస్సీలను మోడీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2023లో తెలంగాణలో పేదల రాజ్యం రావాలి. కెసిఆర్ లాఠీ, పోలీసు తూటాలకు భాజపా కార్యకర్తలు భయపడరు. అగ్రవర్ణ పేదల పక్షాన భాజపా పోరాడుతుంది’ అని బండి సంజయ్ వెల్లడించారు.