హైదరాబాద్ దాసారం బస్తీలో దారుణ హత్య వెలుగు చూసింది. తరుణ్ అనే రౌడీషీటర్ ను బండరాళ్లతో కొట్టి చంపారు. 

హైదరాబాద్ : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. దాసారం బస్తీలో దారుణ హత్య జరిగింది. రౌడీషీటర్ తరుణ్ పై బండరాళ్లతో దాడి చేసిన మరో రౌడీషీటర్ షేక్ షరీఫ్ దాడి చేశాడు. దీనికి సంబంధించిన స్థానికులు రావడంతో రౌడీషీటర్ పరారయ్యాడు. స్థానికులు వెంటనే తరుణ్ ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. షేక్ షరీఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred