Asianet News TeluguAsianet News Telugu

పది నిమిషాల్లో ఇంటికి చేరుతారనగా ప్రమాదం: పెళ్లి కూతురు సహా ఆమె తండ్రి మృతి

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో పెళ్లింట విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. రిసెప్షన్ కు వెళ్లి వస్తుండగా కారు బోల్తా పడి పెళ్లి కూతురు, ఆమె తండ్రి మరణించారు. పెళ్లి కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు.

Bride and her father die in a road accident in Nirmal district
Author
Nirmal, First Published Aug 28, 2021, 10:11 AM IST

నిర్మల్: తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో పెళ్లింట విషాదం చోటు చేసుకంది. రోడ్డు ప్రమాదంలో పెళ్లి కూతురు, ఆమె తండ్రి మృత్యువాత పడ్డారు. పెళ్లి కొడుకు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు మృతులను మౌనిక, రాజాంలుగా గుర్తించారు. 

వివాహానంత విందుకు హాజరై తిరిగి వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లాలోని పాండవాపురం వంతెన వద్ద కారు బోల్తా పడి ప్రమాదం చోటు చేసుకుంది. పది నిమిషాల్లో ఇంటికి చేరుతారనగా ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం అందరినీ కలత పెట్టింది.

ఇదిలావుంటే, తెలంగాణలోని భువనగిరి- యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. చౌటుప్పల్ లోని ధర్మోజిగుడా సమీపంలో బైకును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

వేబ్రిడ్జి నుంచి లారీని రివర్స్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. లారీ అనుకోకుండా ఒక్కసారిగా రోడ్డు మీదికి రావడంతో బైక్ దాన్ని ఢికొట్టింది. మృతులను హరీష్, సల్మాన్, ఆసిఫ్ లుగా గుర్తించారు. 

మృతుడు హరీష్ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందినవాడు. మిగతా ఇద్దరు హైదరాబాదులోని రామంతపూర్ కు చెందినవారు. పిట్టంపల్లి నుంచి వారు హైదరాబాదు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు కూడా హైదరాబాదులో ఏసీ మెకానిక్ లుగా పనిచేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios