Asianet News TeluguAsianet News Telugu

మహబూబ్ నగర్ లో ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు: కీలకాంశాలపై చర్చ

బీజేపీ  రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు  ఇవాళ మహబూబ్ నగర్ ప్రారంభమయ్యాయి.   రానున్న రోజుల్లో  అనుసరించాల్సిన వ్యూహంపై  ఈ సమావేశాల్లో  చర్చించనున్నారు. 

BJP Telangana State Executive meeting Begins in Mahabubnagar
Author
First Published Jan 24, 2023, 10:58 AM IST

మహబూబ్ నగర్: బీజేపీ   రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు  మంగళవారం నాడు  మహబూబ్ నగర్ లో  ప్రారంభమయ్యాయి.   ఈ  సమావేశానికి  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.  ఈ ఏడాది చివర్లో  తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో   రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహంపై  ఈ సమావేశంలో  వ్యూహరచన చేయనున్నారు. బీజేపీ  అగ్రనేత సునీల్ భన్సల్  ఈ సమావేశాలకు హాజరయ్యారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ  జాతీయ నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే .  ఇటీవల జరిగిన  జాతీయ కార్యవర్గ సమావేశాల్లో  కూడా  తెలంగాణ విషయమై  చర్చించారు.  తెలంగాణలో  అధికారంలోకి వస్తామనే ధీమాతో  బీజేపీ నాయకత్వం ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో  రాజకీయ తీర్మానంతో పాటు , వ్యవసాయంపై తీర్మానం చేయనున్నారు. అంతేకాదు సామాజిక అంశాలపై  కూడా తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించనుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios