ఇక్కడి వారు అక్కడికి సమాచారం ఇస్తే.. అక్కడివారు ఇక్కడ సమాచారం ఇస్తారని మర్చిపోవద్దంటూ బీజేపీ నేతలకు ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు.

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతోంది. అభ్యర్థులు ఎలాగైనా గెలుపును ఖైవసం చేసుకోవడానికి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలకే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తనకు ఈ ఎన్నిక జీవన్మరణ సమస్య అని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి తాను చావడానికి భయపడను, ఎవరినైనా చంపడానికి భయపడను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఎవరు కోవర్టులుగా పనిచేశారో నాకు తెలుసు అన్నారు. ఈసారి అలా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇక్కడి వారు అక్కడికి సమాచారం ఇస్తే.. అక్కడివారు ఇక్కడ సమాచారం ఇస్తారని మర్చిపోకండి.. అంటూ హెచ్చరికలు జారీ చేశారు.