Asianet News TeluguAsianet News Telugu

''పద్మినీరెడ్డి ఓ కోవర్టు...భర్త రాజనర్సింహ కోసమే బిజెపిలో చేరారు''

మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టో కమిటీ అధ్యక్షుడు దామోదర రాజనర్సంహ భార్య పద్మిని రెడ్డి గురువారం రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఉదయం కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే మళ్లీ రాజకీయ ఒత్తిళ్లు, కార్యకర్తల డిమాండ్ కు తలొగ్గి సాయంత్రం సొంతగూటికి(కాంగ్రెస్) చేరారు. ఇలా ఒకేరోజు రెండు పార్టీల కండువాలు మార్చి పద్మినీ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచారు.

bjp leader madhavi fires on padmini reddy
Author
Hyderabad, First Published Oct 12, 2018, 9:09 PM IST

మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టో కమిటీ అధ్యక్షుడు దామోదర రాజనర్సంహ భార్య పద్మిని రెడ్డి గురువారం రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఉదయం కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే మళ్లీ రాజకీయ ఒత్తిళ్లు, కార్యకర్తల డిమాండ్ కు తలొగ్గి సాయంత్రం సొంతగూటికి(కాంగ్రెస్) చేరారు. ఇలా ఒకేరోజు రెండు పార్టీల కండువాలు మార్చి పద్మినీ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచారు.

ఈ పరిణామంపై బిజెపి పార్టీలో బిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ పద్మిని రెడ్డి బిజెపి పార్టీ సానుభూతిపరురాలే అంటూ మిజెపి పార్టీ ప్లోర్ లీడర్ కిషన్ రెడ్డి వెల్లడించారు. అయితే అదే పార్టీ మహిళా నేత, సినీ నటి మాధవి మాత్రం కాస్త ఘాటుగా స్పందించారు. సామాజి మాధ్యమం ద్వారా ఈ విషయంపై మాధవి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

బిజెపి పార్టీలో చేరేముందే కార్యకర్తల నుండి వ్యతిరేకత వస్తుందన్న విషయం పద్మినీ రెడ్డి కి తెలియదా అని మాధవి ప్రశ్నించారు. ఆమెకు ఆలోచన లేదా? లేక పసిపిల్లనా? అని ప్రశ్నించారు. ఆమె బిజెపి పార్టీలో చేరింది ఈ పార్టీలోని అంతర్గత విషయాలను కాంగ్రెస్ పార్టీకి చేరవేయడానికేనని ఆరోపించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టో కమిటీ బాధ్యతలు చూస్తున్న తన భర్త దామోదర రాజ.నర్నింహకు సహకరించడానికే ఈ పని చేశారన్నారు. ఇలాంటి కోవర్టులకు బిజెపి పార్టీలో స్థానం లేదని మాధవి ఘాటుగా స్పందించారు. 

సంబంధిత వార్తలు

దామోదర భార్య బిజెపిలో చేరడం వెనక కథ ఇదే...

పీఛే ముడ్: పద్మినీరెడ్డి సాయంత్రానికల్లా మళ్లీ.. (వీడియో)

పద్మినీరెడ్డి యూటర్న్:కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటన

బీజేపీలో చేరే విషయం మా ఆయనకు చెప్పా: దామోదర భార్య పద్మిని రెడ్డి
 

Follow Us:
Download App:
  • android
  • ios