భైంసాలో తెరాస కు షాక్... బీజేపీ, మజ్లీస్ హోరాహోరీ
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా తెరాస హవా కనిపిస్తున్నప్పటికీ... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీ పరిధిలో తెరాస అసలు ఎక్కడ స్క్రీన్ మీద కనబడడం లేదు.
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా తెరాస హవా కనిపిస్తున్నప్పటికీ... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీ పరిధిలో తెరాస అసలు ఎక్కడ స్క్రీన్ మీద కనబడడం లేదు.
భైంసాలో తెరాస వర్సెస్ ఎంఐఎం గా నడుస్తుంది. అక్కడ ఉన్న 32 వార్డుల్లో ఇప్పటివరకు వెలువడ్డ 13 వార్డుల ఫలితాలకు గాను బీజేపీ 6 వార్డుల్లో విజయం సాధించగా... ఎంఐఎం 7 వార్డుల్లో విజయం సాధించింది.
తెరాస, కాంగ్రెస్ లు ఇక్కడ అసలు స్క్రీన్ మీద కనబడడం లేదు. భైంసాలో ఎప్పటినుండో ఉన్న మతప్రాదిపదికన ఓట్ల విభజన మరో మారు అక్కడ స్పష్టంగా కనబడుతుంది.
తాజాగా సంక్రాంతి పండగ ముందు ఈ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి ( జనవరి 12వ తేదీ 9 గంటల ప్రాంతంలో) ఒక వర్గానికి చెందిన యువకుడు బైక్ తో చేసిన అతి విన్యాసాలు ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. చిన్నగా మొదలైన వివాదం పట్టణమంతా పాకి తీవ్రరూపం దాల్చి పట్టణం మొత్తంతో హింసకు కారణమయ్యింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మోటార్ సైకిల్ ను ఓ వీధిలో రాష్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతూ ఓ యువకుడు హంగామా చేశాడు. దీంతో స్థానిక యువకులు ఆ యువకున్ని పట్టకుని మందలించి వదిలివేశారు. అయితే ఇలా మందలించినవారు వేరే వర్గానికి చెందినవారు కావడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోడానికి సదరు యువకుడు సిద్దమయ్యాడు.
తన వర్గానికి చెందిన దాదాపు 400-500 మందిని తీసుకువెళ్లి తనను మందలించిన యువకులపై దాడికి పాల్పడ్డాడు. ఇలా వీరు ఆ వీధిలోని 18 ఇండ్లను తగలబెట్టి హింసాత్మక వాతావరణం సృష్టించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినాకూడా వినిపించుకోని అల్లరిమూకలు పోలీసులపై రాళ్ళ దాడి చేస్తూ ఫైర్ ఇంజన్ వాహనాల పైపులను కోయడం జరిగింది. ఈ దాడులనే అదునుగా చేసుకుని పలువురి ఇళ్లను కూడా లూటీ చేసినట్లు సమాచారం.
ఈ ఘటనలో 8మంది పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే 18 ఇండ్లు ద్వంసమవగా అనేక ఇండ్లలో లూటీ జరిగింది. మరికొందరు యువకులకు కూడా గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ అల్లర్ల నేపథ్యంలో బైంసా పట్టణంలో ఇంటర్నెట్ సేవలు నిలిపేసిన పోలీసులు కట్టుదిట్టమైప బందోబస్తును ఏర్పాటుచేశారు.