భార్యపై అనుమానం.. బ్యూటీపార్లర్లో హత్యాయత్నం
హైదరాబాద్ లోని శ్రీనగర్కాలనీలో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ఓ భర్త తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. బ్యూటీపార్లర్లో పనిచేస్తున్న ఆమెపై అనుమానంతో భర్త దారుణానికి ఒడిగట్టాడు. దీంతో పార్లర్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మానవీయ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. చిన్నచిన్న కారణాలతో ఎదుటి వారు ఎంతటి అయినవారైన సరే.. హత్య చేసేందుకు వెనకాడటం లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు విషబీజాలుగా మారి.. పచ్చ సంసారాన్ని తెంచుకుంటున్నారు. వేదమంత్రాలతో అగ్నిసాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటై దాపత్యబంధాన్ని..చివరివరకు కొనసాగాలంటే.. ఇరువురు మధ్య అపారమైన నమ్మకం ఉండాలి. కానీ ప్రస్తుతం తరుణంలో.. మారుతున్న కాలంలో నమ్మకాల్లోనూ, అనురాగాల్లోనూ భార్యాభర్తల మధ్య రోజురోజుకు విబేధాలు పెరుగుతూ వస్తున్నాయి.
పెళ్ళై ఏడాదైనా.. పదేళ్లుగా సంసారాన్ని సాగించిన దంపతుల మధ్య నమ్మకం లేకపోతే.. వారి వివాహ బంధం కొనసాగడం కష్టం. ప్రస్తుతం వివాహేతర సంబంధాలు కాపురాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. భర్త వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య.., భార్యపై భర్త.. అనుమానాలు పెంచుకుని.. చంపుకునే ఘటనలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి తన భార్య మరోకరితో చనువుగా ఉందని..
భార్యను హతమర్చే ప్రయత్నం చేశారు. ఆమె ప్రాణభయంతో పరుగులు తీసింది. ఈ ఘటన హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీ సమీపంలో వెలుగు చూసింది.
వివరాల్లోకెళ్తే.. నగరంలోని శ్రీనగర్ కాలనీ సమీపంలో సుమతి, రాజు అనే యువ దంపతులు నివసిస్తున్నారు. జీవనోపాధి కోసం సుమతి సమీపంలోని వెంకీస్ హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియోలో పని చేస్తోంది. ఇదిలా ఉండగా, తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే భర్త రాజు.. ఆమెపై అనుమానం పెట్టుకున్నారు. ఈ విషయంలో భార్యతో పలుమార్లు గొడవ పడ్డాడు.
ఈ క్రమంలో భర్త రాజు.. తన భార్య పని చేస్తున్న బ్యూటీ పార్లర్కు వెళ్లాడు. అ తరువాత.. ఆమెపై హత్యయత్నం చేద్దామని ప్రయత్నించారు. కత్తితో వచ్చిన రాజును చూసి అక్కడి వారంతా భయభంత్రులకు గురై హడలెత్తి పోయారు. ఈ క్రమంలో భార్యను తీవ్రంగా కొట్టాడు రాజు. అనంతరం కత్తితో పార్లర్ సిబ్బందిని బెదిరించాడు. దీంతో, వెంకీస్ హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియో యజమాని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. రాజుపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.