తన కుమార్తె వివాహానికి వచ్చి.. నూతన వధూవరులను ఆశీర్వదించాల్సిందిగా.. అసదుద్దీన్.. సీఎం కేసీఆర్ ని కోరారు.

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. తన కుమార్తె వివాహానికి వచ్చి.. నూతన వధూవరులను ఆశీర్వదించాల్సిందిగా.. అసదుద్దీన్.. సీఎం కేసీఆర్ ని కోరారు. కేసీఆర్ నివాసానికి వచ్చి మరీ.. ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించిన కేసీఆర్.. కచ్చితంగా శుభాకార్యానికి హాజరౌతానని హామీ ఇచ్చారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్, కేసీఆర్ ల మధ్య స్నేహం బలపడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయంసాధించి.. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.