Communal violence:  దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని జ‌హంగీర్‌పూరిలో చోటుచేసుకున్న మ‌త హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో పోలీసులు త‌మ కార్య‌క‌ర్త‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటే..వారిపై యుద్ధం చేస్తామంటూ విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (వీహెచ్‌పీ) హెచ్చ‌రించింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. వీహెచ్‌పీ చ‌ట్టానికి అతీతంగా ఉందా? అంటూ కేంద్ర మంత్రి అమిత్ షాను ప్ర‌శ్నించారు.  

Telangana minister KTR: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చట్టానికి అతీతంగా ఉందా? అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీ. రామారావు (కేటీఆర్‌) మంగళవారం నాడు అన్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జహంగీర్‌పూరిలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించి తమ కార్యకర్తలపై ఏదైనా చర్య తీసుకుంటే ఢిల్లీ పోలీసులపై యుద్ధం చేస్తామని విశ్వ‌హిందూ ప‌రిష‌త్ బెదిరించినట్లు వచ్చిన రిపోర్టులు నేప‌థ్యంలోనే మంత్రిక కేటీఆర్ పై వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్ర‌శ్నించారు. ఢిల్లీ పోలీసులపై ఈ విపరీతమైన ధోర‌ణిని సహిస్తారా? అని అమిత్ షాను ప్రశ్నించారు.

ట్విట్ట‌ర్ వేదిక‌గా మంత్రి కేటీఆర్ ఢిల్లీలో చోటుచేసుకున్న మ‌త హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై స్పందించారు. విశ్వ‌హిందూ ప‌రిష‌త్ పోలీసుల‌ను బెదిరించిన వ్యాఖ్య‌ల‌పై.. “వీరు దేశ చట్టానికి అతీతులా? హోం మంత్రి అమిత్ షాజీ ” అని ట్వీట్ చేశారు. అలాగే, "మీకు నేరుగా నివేదించే ఢిల్లీ పోలీసులపై ఇలాంటి దారుణమైన అర్ధంలేని మాటలు మీరు సహిస్తారా?" అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. అనుమతి లేకుండా ఊరేగింపు నిర్వహించినందుకు నిర్వాహకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి స్థానిక విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (వీహెచ్‌పీ) నాయకుడిని అరెస్టు చేసిన తర్వాత వీహెచ్‌పీ ఇలాంటి బెదిరింపులు చేసింది. 

Scroll to load tweet…

కాగా, మంత్రి కేటీఆర్ మరో ట్వీట్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్‌పీఏగా అభివర్ణించారు. “భారతదేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరింది. ఇంధన ధరలు ఆల్ టైమ్ రికార్డు గ‌రిష్టానికి చేరుకున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధర ప్రపంచంలోనే అత్యధికం మ‌న దేశంలోనే ఉంది. వినియోగదారుల విశ్వాసం అత్యల్పంగా ఉందని ఆర్‌బీఐ చెబుతోంది” అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. “దీనిని మనం ఎన్డీయే ప్రభుత్వం అని పిలవాలా లేక ఎన్పీయే ప్రభుత్వం అని పిలవాలా? అంటూ ప్ర‌శ్నించారు. 

Scroll to load tweet…

కాగా, జహంగీర్‌పూరిలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసకు సంబంధించి తమ కార్యకర్తలపై ఏదైనా చర్య తీసుకుంటే ఢిల్లీ పోలీసులపై యుద్ధం ప్రారంభిస్తామని విశ్వ హిందూ పరిషత్ ( వీహెచ్‌పీ) సోమవారం బెదిరించింది . అనుమతి లేకుండా ఊరేగింపు చేపట్టినందుకు నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, స్థానిక వీహెచ్‌పీ నాయకుడు ప్రేమ్ శర్మ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపిన తర్వాత ఈ హెచ్చ‌రిక‌లు వ‌చ్చాయి.