Asianet News TeluguAsianet News Telugu

ఆలయ భూముల కబ్జా ఆరోపణలు: ఈటెల రాజేందర్ మీద మరో కమిటీ

శామీర్ పేట మండలం దేవర యంజాలలో భూకబ్జాల ఆరోపణలపై కూడా కేసీఆర్ ప్రభుత్వం కమిటీ వేసింది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఇతరులు ఆలయ భూములను ఆక్రమించారనే ఫిర్యాదులు వచ్చాయి.

Another committee constitueted to enquire on Eatela Rajender Land grabbing
Author
Hyderabad, First Published May 3, 2021, 1:18 PM IST

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆలయ భూములను ఆక్రమించారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మరో విచారణ కమిటీని వేసింది. నలుగురు ఐఎఎస్ అధికారులతో ప్రభుత్వం ఆ కమిటీని వేసింది. శామీర్ పేట మండలం దేవరయంజాల సీతారామస్వామి ఆలయ బూములను ఆక్రమించారనే ఆరోపణపై విచారణకు ఆ కమిటీ వేసింది.

కమిటీలో పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ జీవన్, బారతి హొలికెరి, శ్వేత మహంతి ఉన్ారు. ఈటెల రాజేందర్, ఇతరులు ఆ భూములను ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదులపై విచారణకు ఆ కమిటీని వేశారు. 

దాదాపు 1,561 ఎకరాల ఆలయ భూములను కబ్జా చేశారని, అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు వచ్చాయి. ఆ భూమి వేల కోట్ల రూపాయల విలువ చేస్తుందని అంటున్నారు. భూముల కబ్జా వెనక ఉన్న పెద్దమనుషులు, బినామీలు ఎవరనేది గుర్తించాలని ప్రభుత్వం కమిటీకి సూచించింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

భూకబ్జాలకు పాల్పపడినవారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కూడా సూచించాలని ప్రభుత్వం సూచించింది. మెదక్ జిల్లా అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో ఈటెల రాజేందర్ భూములను ఆక్రమించారనే ఆరోపణను విచారణలో నిర్ధారించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరిగిన తీరుపై ఈటెల రాజేందర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. 

ఆ కమిటీ ఏర్పాటుపై కూడా ఈటెల రాజేందర్ తన మీడియా సమావేశంలో స్పందించారు. దివాన్ కమిటీ ఆ భూములపై విచారణ జరిపి నివేదిక ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ విషయం కేసీఆర్ కు తాను చెప్పినట్లు కూడా ఆయన తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios