Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్‌లో బీజేపీ దళిత కార్యకర్త ఇంటికి వెళ్లిన అమిత్ షా..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తన పర్యటనలో భాగంగా అమిత్ షా.. సికింద్రాబాద్ సాంబమూర్తి నర్‌లో బీజేపీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంటికి  వెళ్లారు.

Amit Shah visits BJP Dalit Worker Home in Secunderabad
Author
First Published Aug 21, 2022, 3:08 PM IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అమిత్ షాకు బేగం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అమిత్ షా అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. 

అనంతరం సికింద్రాబాద్ సాంబమూర్తి నర్‌లో బీజేపీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంటికి  వెళ్లారు. తమ ఇంటికి వచ్చిన అమిత్ షాకు సత్య నారాయణ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తరుణ్ చుగ్, స్థానిక బీజేపీ కార్పొరేటర్ సత్యనారాయణ నివాసంలోనికి వెళ్లారు. సత్యనారాయణ నివాసంలో అమిత్ షా తేనీరు సేవించారు. అలాగే సత్యనారాయణ కుటుంబ సభ్యులతో ఆయన ముచ్చటించారు. ఇక, సత్యనారాయణ దాదాపు 30 ఏళ్లుగా బీజేపీలో కార్యకర్తగా కొనసాగుతున్నారు. అమిత్ షా తన ఇంటికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా సత్యనారాయణ చెప్పారు. అమిత్ షా రాకపై సత్యనారాయణ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అనంతరం అమిత్ షా బేగంపేట ఎయిర్ట్‌కు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయంలో కొంత మంది రైతు ప్రతినిధులతో అమిత్ షా సమావేశమవుతారు. తర్వాత అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో మునుగోడుకు బయలుదేరుతారు. మునుగోడులో బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్ని ప్రసంగించనున్నారు. ఇక, అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆయన పర్యటించే ప్రాంతాలతో పాటు, మునుగోడులో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 

మునుగోడు చేరుకుని.. అక్కడ కొద్దిసేపు సీఆర్‌పీఎఫ్ అధికారులతో సమీక్షలో పాల్గొంటారు. అనంతరం మునుగోడులో బీజేపీ సభకు బయలుదేరి వెళతారు. ఈ సభ వేదికగా బీజేపీ శ్రేణులకు అమిత్ షా దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. అమిత్ షా సమక్షంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు. 

ఈ సభ అనంతరం ఆయన రామోజీ ఫిల్మ్‌ సిటీకి వెళ్లనున్నారు. అక్కడ దాదాపు 45 నిమిషాల సమయం ఉండనున్నారు. అనంతరం శంషాబాద్ నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ బీజీపీ ముఖ్యనేతలు, పలువురు ప్రముఖులతో అమిత్ షా సమావేశం కానున్నారు. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అమిత్ షాను కలవనున్నారు. అనంతరం అమిత్ షా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. 

Follow Us:
Download App:
  • android
  • ios