Asianet News TeluguAsianet News Telugu

కనిపించకుండా పోయిన వ్యక్తి.. కుళ్లిన స్థితిలో చెట్టునుంచి రాలి మృతదేహంగా లభ్యం...!

మేడ్చల్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ అతివేల్లికి చెందిన గడ్డం ప్రకాష్ ఈ నెల 1వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ఈ మేరకు అతని భార్య ఈ నెల 6న మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

abscond man found dead in medchal, hyderabad
Author
Hyderabad, First Published Aug 27, 2021, 3:00 PM IST

హైదరాబాద్ : నేటిరోజుల్లో ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. కుటుంబసమస్యలు, ఆర్థిక పరమైన కారణాలు, మానసికాందోళనలు, ఒత్తిడి.. ఇలా ఏ చిన్న సమస్య ఎదురైనా తట్టుకునే మానసికస్థైర్యాన్ని కోల్పోతున్నారు. దీంతో బలవంతంగా బతుకు చాలిస్తున్నారు. కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. అలాంటి ఓ దారుణమైన ఘటన హైదరాబాద్ లో జరిగింది. 

మేడ్చల్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ అతివేల్లికి చెందిన గడ్డం ప్రకాష్ ఈ నెల 1వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ఈ మేరకు అతని భార్య ఈ నెల 6న మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

కాగా, శుక్రవారం నాడు అతివేల్లిలోని ఓ సిమెంట్ తయారీ కంపెనీ సమీపంలోని చింతచెట్టు కింద కుళ్లిన స్థితిలో ఓ శవం కనిపించింది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేమానికి పంచనామా చేసి మార్చురీకి తరలించారు.

వారి దర్యాప్తులో ఆ శవం గడ్డం ప్రకాష్ దిగా గుర్తించారు. అతను ఉరివేసుకుని ఉంటాడని.. పది రోజులకు పైగా మృతదేహం కుళ్లి పోవడంతో చెట్ట మీదినుంచి కింద పడిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రకాశ్ మరణానికి కారణాలేంటో ఇంకా తెలియరాలేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios