Asianet News TeluguAsianet News Telugu

నల్గొండలో బాలిక మీద ముగ్గురు యువకుల అత్యాచారం.. బట్టల దుకాణంలోకి పిలిచి, బలవంతంగా..

పండగకు అమ్మమ్మగారింటికి వచ్చిన ఓ పదో తరగతి విద్యార్థిని సామూహిక హత్యాచారానికి గురైంది. ఈ ఘటన నల్గొండలో కలకలం రేపింది. 

A girl was raped by three youths in Nalgonda - bsb
Author
First Published Jan 19, 2023, 11:04 AM IST

నల్గొండ :  ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు.  వారి మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇలాంటి వారి బారి నుంచి అమ్మాయిలు తమను తాము రక్షించుకోలేకపోతున్నారు. అలాంటి దారుణ ఘటన ఒకటి నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. సంక్రాంతి పండుగకు అమ్మమ్మగారి ఊరికి వెళ్లిన ఓ అమ్మాయి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాదుకు చెందిన  ఓ బాలిక పదవ తరగతి చదువుతోంది.  సంక్రాంతి పండుగ కోసం నల్గొండ జిల్లా పీఏ పల్లి  మండలంలో ఉంటున్న అమ్మమ్మగారింటికి ఈనెల 13న వచ్చింది.

సంతోషంగా పండగ జరుపుకుని తిరిగి హైదరాబాదుకు వెళ్లేందుకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. వారు ముగ్గురు పెద్ద అడిచర్లపల్లి మండలం వడ్డేరి గూడెనికి చెందిన యువకులు నరేష్, శివ, దిలీప్ లు. వారు అంతకుముందే అమ్మాయికి పరిచయం. దీంతో వారితోపాటు అంగడిపేట క్రాస్ రోడ్డు వద్దకు బాలిక వచ్చింది. అక్కడ కారు దిగిన బాలిక హైదరాబాద్ వెళ్లేందుకు బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురుచూస్తోంది.

జై తెలంగాణ అని ఎందుకు అనలేదు: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

కాగా ఆ ముగ్గురు యువకుల్లో నరేష్ కు బస్ స్టాప్ కు ఎదురుగానే బట్టల దుకాణం ఉంది. చాలాసేపు బస్సు కోసం ఎండలో ఎదురుచూస్తున్న ఆ అమ్మాయిని  నరేష్ తన బట్టల షాపులోకి పిలిచాడు. అప్పటివరకు కారులో లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి.. తెలిసిన వ్యక్తి కావడంతో.. ఆ అమ్మాయి అతని దుకాణంలోకి వెళ్ళింది. అప్పటికే అక్కడ మిగిలిన ఇద్దరు యువకులు ఉన్నారు. బాలిక దుకాణంలోకి వచ్చిన కొంత సమయం తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయిందని చెబుతూ ఆ ముగ్గురు యువకులు ఓ స్థానిక డాక్టర్ దగ్గరికి ఆమెను తీసుకువెళ్లి. చూపించారు. 

ఆమెను పరీక్షించిన డాక్టర్ వెంటనే దేవరకొండకు తీసుకువెళ్లాలని చెప్పాడు. ముగ్గురు యువకులు ఆమెను దేవరకొండకు తీసుకెళ్లి డాక్టర్లకు చూపించక బాలిక అప్పటికే మృతి చెందిందని వారు నిర్ధారించారు. బాలిక మృతి చెందడంతో నరేష్, శివ, దిలీప్ లు భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న దేవరకొండ డిఎస్పి  నాగేశ్వరరావు అక్కడి పరిసరాలను పరిశీలించారు. 

మృతదేహాన్ని కూడా పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ షా మృతదేహాన్ని కూడా పరిశీలించి విచారణ చేపట్టారు ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.  ముగ్గురి యువకులు బాలిక మీద అత్యాచారం చేశారని తేలింది. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం అయింది.  ఆకారణంగానే బాలిక మృతి చెందిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. తన కూతురి మీద అఘాయిత్యం చేసి హత్య చేశారని బాలిక తండ్రి ఆ ముగ్గురు యువకుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు.  దీనిమీద దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios