Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కరోనా అప్‌డేట్: హైదరాబాద్, ఖమ్మంలో సరిసమానం.. నిర్మల్, కామారెడ్డిలలో ‘‘సున్నా’’ కేసులు

తెలంగాణలో కొత్తగా 729 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఆరుగురు మరణించగా.. 987 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. అత్యధికంగా హైదరాబాద్, ఖమ్మంలలో 72 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

729 new corona cases reported in telangana ksp
Author
Hyderabad, First Published Jul 9, 2021, 9:25 PM IST

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. గడిచిన కొన్ని రోజుల నుంచి నిలకడగా 1000కి లోపే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,06,045 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 729 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ, ఖమ్మం జిల్లాలోనూ 72 చొప్పున కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. అదే సమయంలో 987 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ వల్ల  ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 3,720కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 6,30,514 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,15,852 మంది వైరస్ నుంచి విముక్తులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,942 మంది చికిత్స పొందుతున్నారు. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 31, జీహెచ్ఎంసీ 72, జగిత్యాల 19, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 15, గద్వాల 2, కామారెడ్డి 0, కరీంనగర్ 42, ఖమ్మం 72, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 6, మహబూబాబాద్ 30, మంచిర్యాల 45, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 35, ములుగు 21, నాగర్ కర్నూల్ 5, నల్గగొండ 59, నారాయణపేట 3, నిర్మల్ 0, నిజామాబాద్ 4, పెద్దపల్లి 32, సిరిసిల్ల 22, రంగారెడ్డి 38, సిద్దిపేట 27, సంగారెడ్డి 14, సూర్యాపేట 24, వికారాబాద్ 6, వనపర్తి 10, వరంగల్ రూరల్ 7, వరంగల్ అర్బన్ 51, యాదాద్రి భువనగిరిలో 20 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios