Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఈ ఒక్క రోజే 50 కరోనా కేసులు: 700కు చేరిన సంఖ్య

తెలంగాణలో ఈ ఒక్క రోజే కొత్తగా 50 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 700కు చేరుకుంది. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆ వివరాలను వెల్లడించారు.

50 fresh cases registered today in Telangana, toll reaches 700
Author
Hyderabad, First Published Apr 16, 2020, 6:47 PM IST

హైదరాబాద్: తెలంగాణలో ఈ ఒక్క రోజే 50 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కు చేరుకుంది. కొత్త కేసులన్నీ జిహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు ఆయన తెలిపారు. కరోనాతో ఇప్పటి వరకు 18 మరణించినట్లు ఆయన తెలిపారు. 

మర్కజ్ కు వెళ్లి వచ్చిన 6గురి వల్ల 81 మందికి కరోనా వైరస్ సోకిందని మంత్రి గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో చెప్పారు. మర్కజ్ వెళ్లి వచ్చినవారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ రోజు 68 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయినట్లు తెలిపారు. కరోనా వైరస్ కేసులు పెరిగినా, తగ్గినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్నింటికీ సన్నద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. 

ప్లాస్మా థెరపీ అనుమతి కోసం ఐసీఎంఆర్ కు రాశామని మంత్రి చెప్పారు. కరీనంగర్ లో ఇంటింటి సర్వే వల్ల మంచి ఫలితాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. రాజకీయ నేతలు ఆత్మస్థయిర్యం దెబ్బ తీసే మాటలు మాట్లాడడం మంచిది కాదని, పీపీఈ కిట్లు, మాస్కులు లేవని కొంత మంది రాజకీయ నాయకులు అంటున్నారని ఆయన అన్నారు. 

రోజుకు 3 లక్షల మాస్కులు తయారు చేసే సామర్థ్యం తమకు ఉందని ఆయన చెప్పారు. గచ్చిబౌలి ఆస్పత్రిలో మరో 1500 పడకలు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. దాన్ని ఈ నెల 20వ తేదీన ప్రారంభిస్తామని అన్నారు. రోజుకు 20 లక్షల టెస్టులు నిర్వహించే విధంగా సామర్థ్యం పెంచుకుంటున్నట్లు రాజేందర్ తెలిపారు. బ్యాంకుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలని, ప్రజల జబ్బులు ఎక్కడికీ పోవని ఆయన అన్నారు.

వైద్యులకు అన్ని రకాల సౌకర్యాలు కలిపిస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని లాబ్ లలో టెస్టులు స్థాయి ని భట్టి చేస్తున్నారని రాజేందర్ చెప్పారు. ఇప్పుడు ఉన్న వాటితో పాటు మరో రెండు లాబ్ లకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, ఈ రెండు లాబ్ లు 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని, మరో మూడు వారాల్లో అధునాతన యంత్ర పరికరాలు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.

కరోనా కేసులు ఒక రోజు పెరుగుతూ..మరొక రోజు తగ్గుతున్నాయని, పాజిటివ్ కేసులు ఎప్పటికప్పుడు డిచార్జ్ కూడా అవుతున్నారని చెప్పారు.10లక్షల పీపీఈ కిట్స్- ఎన్95 మాస్క్ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పీపీఈ కిట్స్ అండ్ ఎన్95 మాస్క్ లు సరఫరా చేశామని చెప్పారు. 

ఈ రోజు వరకు 10వేల టెస్టులు చేసామని మంత్రి తెలిపారు. గాంధీ లో ఇప్పటి వరకు అనుమానితులు ఎవ్వరు లేరని చెప్పారు. గాంధీ- చెస్ట్-కింగ్ కోటి హాస్పిటల్ లో మరిన్ని సౌకర్యాలు కలిపిస్తామని చెప్పారు. జలుబు-దగ్గు-తుమ్ములు లేకుండా కరొనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. హాస్పిటల్ లలో చికిత్స తీసుకుంటున్న వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios