Asianet News TeluguAsianet News Telugu

24 గంటల్లో 453 మందికి పాజిటివ్... తెలంగాణలో 6,51,288కి చేరిన మొత్తం కేసులు

తెలంగాణలో కొత్తగా 453 కరోనా కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృతి చెందారు. 591 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 8,137 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

453 new corona cases reported in telangana
Author
Hyderabad, First Published Aug 12, 2021, 9:13 PM IST

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 89,675 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 453 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,51,288కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,836కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 591 మంది కోలుకున్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం 8,137 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 69 కేసులు నమోదయ్యాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 12, జీహెచ్ఎంసీ 69, జగిత్యాల 18, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 3, గద్వాల 1, కామారెడ్డి 3, కరీంనగర్ 55, ఖమ్మం 25, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 7, మంచిర్యాల 12, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 25, ములుగు 5, నాగర్ కర్నూల్ 2, నల్గగొండ 31, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 5, పెద్దపల్లి 19, సిరిసిల్ల 12, రంగారెడ్డి 22, సిద్దిపేట 4, సంగారెడ్డి 5, సూర్యాపేట 25, వికారాబాద్ 2, వనపర్తి 5, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ 38, యాదాద్రి భువనగిరిలో 13 చొప్పున కేసులు నమోదయ్యాయి.  

 

Follow Us:
Download App:
  • android
  • ios