ఉగాది పండగ రోజు తీవ్ర విషాదం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఉగాది పండగ రోజు తీవ్ర విషాదం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. జిల్లాలోని చారకొండ మండలం తుర్కల పల్లి సమీపంలో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. 

మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను సూర్యాపేట జిల్లా నేరేడుచర్లవాసులుగా గుర్తించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.