హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. హైటెక్ సిటీ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. రైల్వే ట్రాక్ పై నుంచి వెళ్తున్న ముగ్గురిని ఎంఎంటీఎస్ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న నాంపల్లి రైల్వే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. హైటెక్ సిటీ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. రైల్వే ట్రాక్ పై నుంచి వెళ్తున్న ముగ్గురిని ఎంఎంటీఎస్ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న నాంపల్లి రైల్వే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే వీరిది ఆత్మహత్యా..? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred