తెలంగాణ (Telangana)లో కొత్తగా 203 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 160 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4001 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (Telangana) కరోనా పాజిటివ్‌ కేసులు (corona cases) మరోసారి 200 దాటింది. గత 24 గంటల్లో 40,730 శాంపిల్స్‌ పరీక్షించగా… 203 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు కరోనా కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో.. 160 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,77,341కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 6,69,488కు పెరిగింది. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,001కు చేరింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 87 కేసులు వెలుగు చూశాయి.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 4, జీహెచ్ఎంసీ 87, జగిత్యాల 3, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 2, కరీంనగర్ 12, ఖమ్మం 8, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 5, మంచిర్యాల 2, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 12, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 4, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 1, పెద్దపల్లి 4, సిరిసిల్ల 2, రంగారెడ్డి 19, సిద్దిపేట 1, సంగారెడ్డి 5, సూర్యాపేట 5, వికారాబాద్ 1, వనపర్తి 3, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ 7, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…